NewsOrbit
టాప్ స్టోరీస్

‘ఇది ప్రజాసంక్షేమ ప్రభుత్వం’

 

కడప: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా  రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద 54లక్షల మంది రైతు కుటుంబాలకు 8750కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా 15.36లక్షల మంది కౌలు రైతులు కూడా ప్రయోజనం కలుగుతోందని జగన్ పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని రైతు దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ గత ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపుతూనే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందనీ, అందుకే రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామని జగన్ అన్నారు. ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామని జగన్ పేర్కొన్నారు. అక్టోబర్ 15నుండి వైఎస్ఆర్ భరోసా పథకం కింద 12,500 రూపాయలు అందజేస్తామని జగన్ అన్నారు.

వ్యవసాయంలో దశ, దిశ ఉండేలా ప్రణాళిక రచిస్తున్నామని జగన్ చెప్పారు. గోదావరి జలాలను నాగార్జునసాగర్‌కు కలపడం వల్ల ఈ ప్రాంతం సశ్యశ్యామలం అవుతుందని జగన్ పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ‌కూడా అంగీకారం తెలిపారని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో కడప జిల్లాకు ప్రతిపాదించిన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ తెలిపారు. కెజి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు కందూ నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టు నిర్మిస్తామనీ, డిసెంబర్ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు. ఈ నది నుండి ఎత్తిపోతల పథకం ద్వారా బ్రహ్మసాగర్‌కు నీళ్లు తీసుకొస్తామని జగన్ చెప్పారు. ఈ సభలోనే వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ పథకాన్ని జగన్ ప్రారంభించారు. తాను హామీ ఇచ్చిన ప్రకారం నవరత్న పథకాలను కశ్చితంగా అమలు చేస్తామని జగన్ వాగ్దానం చేశారు. పెన్షన్ రాకుంటే నేరుగా సిఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయాలనీ, ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేస్తామని జగన్ అన్నారు. సెప్టెంబర్ ఒకటి నుండి నేరుగా సంక్షేమ ఫలాలు ప్రజల ఇంటికే చేరతాయని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఇస్తోందనీ, ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.

ఈ ఏడాది డిసెంబర్ 26న కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని జగన్ ప్రకటించారు.  మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామనీ, 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ చెప్పారు. రైతాంగానికి మార్కెట్ కమిటీల ద్వారా సక్రమంగా సేవలు అందేందుకు గానూ ఎఎంసిలకు ఎమ్మెల్యేలే గౌరవ చైర్మన్‌లుగా నియమిస్తున్నట్లు జగన్ తెలిపారు, ఈ సభలో వ్యవసాయ శాఖ మంత్రి కె కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment