Ayodhya : అయోధ్యలో రామాలయం ప్రతిష్టాపన ఇప్పటి కల కాదు. 500 సంవత్సరాల కలరేపు నెరవేరుతుంది. ఇక అయోధ్య ప్రతిష్టాపన మా కాలంలో జరిగింది అని ఇప్పటి తరం రాబోయే కాలంలో గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ అయోధ్య కట్టేందుకు పలువురుసినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా సహాయపడ్డారు.
ఇక అందరూ చేయి చేయి కలిపి రేపు రాముడి జన్మస్థలంలో రామ మందిరాన్ని ప్రతిష్టాపరించనున్నారు. ఇక ఈ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ హాజరు కాలేనందున ప్రతి గ్రామానికి శ్రీరాముల వారి అక్షంతలు అందేలా చూసారు రామ మందిరం పెద్దలు. ఇక ఈ అయోధ్య అక్షింతలను రేపు (జనవరి 22న ) మధ్యాహ్నం పూజించి తలపై వేసుకోవాలి. అంతేకాకుండా రేపు కొన్ని పనులు చేయడం ద్వారా రాముడి భక్తిని పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. రేపు ప్రతి ఒక్కరు తమ ఇంటిని పెళ్లికి సిద్ధం చేసినట్లు అలంకరించుకుని.. ఇంటి నిండా దీపాలు పెట్టడం చాలా ముఖ్యం.
2. రేపు ప్రతి ఒక్కరూ శుభ్రంగా మైలు కాకుండా ఉండడం వల్ల రాముడి భక్తి మీకు లభిస్తుంది.
3. ఇక దగ్గరిలో ఉండే ఆలయాలలో భజనలు చేయడం… హనుమాన్ చాలీసా చదవడం ఇంకా మంచిది.
4. అలాగే రేపు ప్రతి ఒక్క స్త్రీ కూడా చీరని ధరించి భక్తి శ్రద్ధలతో శ్రీ రాముడిని పూజించడం ద్వారా తమకి తమ కుటుంబానికి ఎల్లప్పుడూ రాముడు అండగా నిలుస్తాడు.
5. అలాగే రేపు అతి ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని నిమ్మతంగా, ప్రశాంతతగా ఉండడం.
పైన చెప్పిన ఐదు పాయింట్లను రేపు పాటించడం ద్వారా ఆ రాముడి ఆశీస్సులు మీకు దక్కుతాయి.