Mahesh Babu: తెలుగు చలనచిత్ర రంగంలో స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరే వేరు. కృష్ణ వారసుడిగా మహేష్ అత్యధికమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో. టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి ఓపెనింగ్స్.. మహేష్ సినిమాకి వస్తాయి. అదేవిధంగా టాలీవుడ్ లో అత్యధికమైన రెమ్యూనరేషన్ అందుకునే హీరోలలో మహేష్ ఒకరు. ఒకపక్క సినిమాలు మరోపక్క యాడ్ రంగంలో కూడా మహేష్ పలు అంతర్జాతీయ కంపెనీలకు అంబాసిడర్ గా రాణిస్తుంటారు. ఇలా ఒకపక్క సినిమా రంగంలో మరోపక్క యాడ్ రంగంలో వచ్చే డబ్బులలో కొంత భాగం అనేక సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది చిన్నపిల్లలకు సంబంధించి గుండే ఆపరేషన్ లు మహేష్ బాబు ఆంధ్ర హాస్పిటల్స్ వైద్యుల చేత ఉచితంగా చేయించడం జరిగింది. అంతేకాదు కొంతమంది పేదవాళ్ళని ఉన్నత చదువులు కూడా చదివిస్తున్నారు. ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మించిన బుర్రెపాలెం ఊరులో రోడ్లు ఇంకా అనేక మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మాదిరిగానే కూతురు సితార కూడా తాజాగా రానించటం విశేషం. ఆమె మొన్నే ఓ ప్రముఖ గోల్డ్ కంపెనీకి సంబంధించి యాడ్ చేయడం జరిగింది. ఆ యాడ్ చేసినందుకు వచ్చిన రెమ్యూనరేషన్ పూర్తిగా సితార చారిటీకి ఇచ్చేసింది.
అంతేకాదు తన పుట్టినరోజు నాడు చాలామంది పేద ఆడపిల్లలకు సైకిల్స్ పంచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు… మహేష్ కొత్త సినిమా “గుంటూరు కారం” నీ.. ఏఎంబి సినిమా ధియేటర్ లో అనాధ పిల్లలతో చూడటం జరిగింది. అతి చిన్న వయసులోనే 11 సంవత్సరాల వయసులో సితార తోటి వారిపట్ల ఎంతో మానవత్వంగా ఉండటం నిజంగా గ్రేట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. మా సితార తండ్రికి తగ్గ తనయురాలు అంటూ గుంటూరు కారం అనాధలతో చూడటం పట్ల మహేష్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఆల్రెడీ “గుంటూరు కారం” సినిమాని.. రిలీజ్ రోజే సుదర్శన్ థియేటర్లో మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం చూడటం జరిగింది. ఆ సమయంలో అభిమానుల కోలాహలానికి సితార థియేటర్లో ఎంతో ఎంజాయ్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు మరోసారి అనాధ పిల్లలతో కలిసి తన సొంత థియేటర్ AMBలో సితార “గుంటూరు కారం” చూడటం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన “గుంటూరు కారం” సంక్రాంతికి విడుదలయ్యి మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా గాని మహేష్ కెరియర్ లో రికార్డు ఇస్తాయి ఓపెనింగ్స్ ఈ సినిమా రాబట్టడం విశేషం.