(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని మార్పును అడ్డుకోగల శక్తి ఎవరున్నారా అని అమరావతి రైతులు దిక్కులు చూస్తున్న తరుణంలో వారికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కనబడ్డారు. ఇప్పడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది. మంగళవారం స్వర్ణభారతి ట్రస్టుకు వచ్చిన వెంకయ్యనాయుడును అమరావతి ప్రాంత రైతులు కలుసుకుని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కళ్ల నీళ్ల పర్యంతమవుతూ తమను రక్షించాల్సిందిగా వేడుకున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో ఉన్న వెంకయ్య నాయుడు ఆంధ్రుల ప్రయోజనాలకు తాము పూచీ పడతామని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అయిదేళ్లు కాదు పదేళ్లు ఉండాలన్నారు. అవశేష ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్కు మద్దతు పలికారు.
విభజన అనంతరం బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రమంత్రి హోదాలో వెంకయ్య నాయుడు నవ్యాంధ్రకు చేదోడువాదోడుగా నిలబడ్డారు. విభజన హామీల అమలు విషయంలో సంబంధిత కేంద్ర శాఖల మంత్రులకూ ముఖ్యమంత్రి చంద్రబాబుకూ మధ్య సంధానకర్తగా నిలిచారు. ఇంతలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావడం, బిజెపి అగ్రనాయకత్వం వెంకయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం జరిగిపోయింది. నవ్యాంధ్రకు కేంద్రంలో ఉన్న ఒక్క అండా లేకుండా పోయిందని అప్పట్లో రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు కూడా.
ఇప్పుడు మళ్లీ వెంకయ్య అవసరం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల పల్లవి ఎత్తుకునే సరికి హతాశులైన రాజధాని రైతులు కేంద్రం ఆదుకోకపోతుందా అన్న ఆశతో ఉన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేసిన అమరావతి నుంచి రాజధానిని మరోచోటికి తరలించడాన్ని కేంద్రం ఎలా సహిస్తుందని వారు అంటున్నారు.
అన్ని విషయాలూ తెలిసిన వెంకయ్యనాయుడు ప్రధానికి పరిస్థితి వివరించి చక్రం అడ్డు వేయాల్సిందిగా కోరాలని రైతులు ఆశిస్తున్నారు. ఇటు రాష్ట్ర బిజెపి కూడా రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నది. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఆయనకు పరిస్థితి వివరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం కూడా రాజధాని మార్పు పరిణామాల గురించి ఆరా తీస్తోందని చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో వెంకయ్యనాయుడును రైతులు కలిసి తమను ఆదుకోవాల్సిందిగా కోరారు. తాను రాజ్యాంగబధ్ధ పదవిలో ఉన్నాననీ, దేనిపైనా బహిరంగంగా వ్యాఖ్యానించలేననీ ఆయన వారితో అన్నారు. అయితే తనకు విషయాలు అన్నీ తెలుసుననీ, ఎవరి దగ్గర ఏం చెప్పాలో అక్కడ అది చెబుతాననీ ఆయన అభయం ఇచ్చారు. దీనితో వెంకయ్య హామీ ఎప్పటికి ఎలా ఫలితం ఇస్తుందోనన్న చర్చ మొదలయింది.
This post was last modified on December 25, 2019 12:43 pm
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More