పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ సైనికాధికారి ఖాసిం సులేమానీ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్.. అనుకున్నట్లుగానే దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 7 సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇరాక్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాక్లోని అసద్, ఇర్బిల్ ఎయిర్ బేస్లపై దాదాపు డజనకుపైగా క్షిపణులతో ఇరాన్ సైన్యం దాడులు చేసింది. ఈ దాడులకు తామే పాల్పడినట్టు ఇరాన్ తన అధికారిక మీడియాలో ప్రకటించింది. ఇది ఆరంభమేనని, మున్ముందు దాడులు తీవ్రతరం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైన్యాలు పశ్చిమాసియాను విడిచివెళ్లాలని సూచించింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
క్షిపణులతో దాడిచేసినట్టు పెంటగాన్ ధ్రువీకరించింది. ఇరాన్ క్షిపణి దాడిలో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇరాక్లోని అమెరికా, సంకీర్ణ దళాలపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రజా సంబంధాలు శాఖ కార్యదర్శి జొనాథన్ హాఫ్మన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాక్ దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది.
మరోవైపు, ఇరాన్ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాక్ దాడులు జరిపినట్లు ధృవీకరించారు. అయితే ప్రాణనష్టంపై ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ క్షిపణుల దాడిలో జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా తమకు అత్యంత శక్తివంతమైన సైన్యం ఉందంటూ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశారు. దీనిపై రేపు ఉదయం ప్రకటన చేస్తానంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తాజా పరిస్థితులపై ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్ హౌస్ వెల్లడించింది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. తాజా పరిణామాలు ఎంత దూరం వెళ్తాయోననే ఆందోళన సర్వత్ర నెలకొంది. రానున్న రోజుల్లో ఇరాన్ పై తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులను అమెరికా చేయవచ్చని, విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on January 8, 2020 11:43 am
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More
Vadinamma: కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్న ముద్దుగుమ్మ మహేశ్వరి. ప్రస్తుత కాలంలో ఓ… Read More
Raj Tarun: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు. ఈయన సినీ ప్రియులకి బాగా… Read More
Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన… Read More
Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నార కాలం… Read More
Baahubali 2: ప్రతి ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు ఎన్నో సినిమాలు థియేటర్స్ లోకి వస్తుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే… Read More
Tollywood Actress: పైన ఫోటోలో కరాటే చేస్తూ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరు గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో స్టార్… Read More
Congress: ఎవరైనా ఒక నాయకుడు నేతల సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటే .. సదరు నేత ఆ పార్టీలో చేరినట్లే… Read More
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఖచ్చితంగా మరో 15 రోజులు మాత్రమే ప్రచారా నికి సమయం ఉంది.… Read More
Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ..… Read More
రాజకీయాల్లో ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం పెరిగిపోతోందా? అంటే.. ఔననే చెప్పాలి. ముఖ్యంగా డీప్ ఫేక్ వచ్చిన తర్వాత.. ఈ… Read More
ఏపీలో రాజకీయాలు సలసల మరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు.. సీఎం జగన్ను అధికారం నుంచి దించేందుకు ప్రతిపక్షాలు చేతులు… Read More