Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మి.. ఆ తర్వాత లేడీ విలన్ గా మరియు సహాయక నటిగా నిలదొక్కుకుంది. బలమైన నెగటివ్ క్యారెక్టర్స్ అండ్ సపోర్టింగ్ రూల్స్ చేస్తూ తెలుగు తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇటీవల కాలంలో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులను టచ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ శబరి అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతుంది. అనిల్ కాట్జ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వరలక్ష్మి టైటిల్ రోల్ ను పోషించింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ మే 3న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరలక్ష్మి శరత్ కుమార్ జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ శబరి చిత్రాన్ని తనవంతు ప్రమోట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి పాల్గొనగా.. కోలీవుడ్ హీరో విశాల్ తో లవ్ రిలేషన్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి.
విశాల్, వరలక్ష్మి చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరూ తొలిసారి జంటగా మధ గజ రాజా సినిమాలో నటించారు. ఆ తర్వాత సండకోజి 2 చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దాదాపు ఏడేళ్లు విశాల్ వరలక్ష్మి రిలేషన్ లో ఉన్నారు. కోలీవుడ్ లో వీరి ప్రేమ వ్యవహారం ఒక సెన్సేషన్. విశాల్, వరలక్ష్మి ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని గతంలో తమిళ మీడియా కోడై కూసింది. కానీ కొన్ని అనూహ్య కారణల వల్ల పెళ్లి వరకు వెళ్లకుండానే విశాల్, వరలక్ష్మి విడిపోయారు.
పబ్లిక్ గా ఈ జంట ఎప్పుడూ తమ రిలేషన్ పై పెదవి విప్పలేదు. దాంతో విశాల్, వరలక్ష్మిపై వచ్చిన ప్రేమ, పెళ్లి వార్తలు కేవలం రూమర్స్ అని కొందరు భావించారు. కానీ అవి రూమార్స్ కాదు.. విశాల్ తో రిలేషన్లో ఉన్నది నిజమే అంటూ తాజాగా వరలక్ష్మి కుండబద్దలు కొట్టింది. శబరి ప్రమోషనల్ లో ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి వచ్చాక తనపై ఎక్కువగా రూమర్స్ లాంటివి రాలేదని, విశాల్తో రిలేషన్ లో ఉన్నానని వార్తలు వచ్చాయి. అవి కూడా రూమర్స్ కాదని వరలక్ష్మి తెలిపింది.
ఒకప్పుడు తాము కలిసున్నామని.. కానీ ఇప్పుడు విడిపోయామని పేర్కొంది. ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్లది అని స్పష్టం చేసింది. మొత్తానికి విశాల్ తో ప్రేమాయణం నడిపింది నిజమే అని వరలక్ష్మి తేల్చేసింది. కాగా వరలక్ష్మి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆమె నిశ్చితార్థం ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో జరిగింది. వీరి పెళ్లికి పెద్దలు డేట్ కూడా లాక్ చేశారు. వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకోవడం పట్ల ఆమె మాజీ ప్రియుడు విశాల్ రీసెంట్ గా స్పందించాడు. వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నందుకు తనకెంతో ఆనందంగా ఉందని.. నటిగా కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటున్నందుకు సంతోషిస్తున్నానని విశాల్ పేర్కొన్నారు.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!