AP Cabinet Meet: జూన్ 7న ఏపీ కేబినెట్ భేటీ .. సీఎం జగన్ ఢిల్లీలో ఉండగానే ఆదేశాలు .. ముందస్తు ఎన్నికలపై మళ్లీ చర్చ..?

Published by
sharma somaraju

AP Cabinet Meet: ఏపి మంత్రి మండలి సమావేశం జూన్ 7వ తేదీన జరగనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1 లో ఈ భేటీ జరగనుంది. ముడు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తొలి రోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో, మరుసటి రోజు శనివారం జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో, ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అమిత్ షాతో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించారని సమాచారం.

CM YS Jagan

 

ఢిల్లీ నుండే అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ ఏర్పాటునకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు రావడంతో మరో సారి ముందస్తు ఎన్నికలపై ఊహగానాలు వస్తున్నాయి. చాలా రోజుల నుండి ఏపిలో ముందస్తు ఎన్నికలు అంటూ ఊహగానాలు వినబడుతున్నాయి. అయితే వైసీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని కొట్టి పారేస్తూ వస్తున్నారు. అయితే రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలే వేరులే అన్నట్లు ముందస్తుకు వెళ్లము అని చెబుతున్నారు అంటే వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ముందు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టక ముందు పలువురు మీడియా ప్రతినిధులు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేనట్లు చెప్పారు. ఆ తర్వాతనే అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల కన్సెప్ట్ గురించి మాట్లాడారు.

రాజకీయ నాయకులు చెప్పింది చేయరు. చేసేది చెప్పరు అనే నానుడి ఉంది.  ఈ కారణంగా అధికార పార్టీ నేతలు ముందస్తుకు వెళ్లము అని కొట్టిపారేస్తున్నా దానిపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ నెలలో విశాఖ షిప్ట్ అవుతాననీ, అక్కడి నుండే పాలన మొదలు పెడతామని చెప్పేశారు. మూడు రాజధానుల విధానంతోనే ఎన్నికలకు వెళతామని మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకు ముందు ప్రకటించారు. దాదాపుగా తెలంగాణతో పాటే ఏపిలో ఎన్నికలకు జగన్ సిద్దమవుతున్నారనే మాట వినబడుతోంది. కేంద్ర పెద్దలు అనుకూలంగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళితే లాభదాయకంగా ఉంటుందనేది జగన్ అంచనాకు వచ్చారని ఒక ప్రచారం జరుగుతోంది.

సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని జగన్ భావిస్తున్నా.. ముందస్తు ఎన్నికలు కోరుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నిధుల సమస్య తీవ్రంగా ఉంది. కేంద్రం నుండి నిధులు రావడమో, లేక అప్పులో పుట్టకపోతే సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి నిలిచిపోయినా, వాయిదా పడినా ఆయా వర్గాల్లో వ్యతిరేక భావన పెరిగే ప్రమాదం ఉంది. అంతే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈజీ గెలుస్తామని వైసీపీ లెక్కలు వేసుకున్నా అసలు పోటీయే లేదు అనుకున్న టీడీపీ మూడింటికి మూడు స్థానాలు కైవశం చేసుకుంది.

అంటే యువత, విద్యావంతుల్లో జగన్ పాలనపై వ్యతిరేకత ఉందని వైసీపీ వర్గాలకు అర్ధం అయ్యింది. గ్రామీణ ప్రాంత ఓటర్లలో కూడా ఆ వ్యతిరేకత మొదలైతే మొదటికే ప్రమాదం వస్తుందని భావిస్తొంది. ఈ రెండు కారణాలతో ముందస్తుకు వెల్లడమే మేలనే ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నయనేది టాక్. ఇక జూన్ 7వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం, మూడు రాజధానుల అంశం, ముందస్తు ఎన్నికలు తదితర కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Breaking: రామోజీకి బిగ్ షాక్ .. రూ.793 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఏపీ సీఐడీ

This post was last modified on May 29, 2023 10:34 pm

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More

May 18, 2024

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More

May 18, 2024

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More

May 18, 2024

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీలో ఎన్నిక‌ల ప‌ర్వం ముగిసింది. సోమ‌వారం జ‌రిగిన పోలింగ్‌లో 81.86 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌రికీ అంతుచిక్క‌ని విష‌యం.… Read More

May 18, 2024

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పల్నాడు, తిరుప‌తి, అనంత‌పురం జిల్లాల్లో చెల‌రేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More

May 18, 2024

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

టీడీపీలో ఇప్పుడు జ‌రుగుతున్న ఆస‌క్తికర విష‌యం.. ఆపార్టీ ప‌గ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేప‌డ‌తార నే. చంద్ర‌బాబు త‌ర్వాత‌.. పార్టీకి… Read More

May 18, 2024

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శినియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More

May 18, 2024

జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More

May 17, 2024

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More

May 17, 2024

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More

May 17, 2024

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More

May 17, 2024

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More

May 17, 2024

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More

May 17, 2024

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున క‌ల‌. ఆయ‌న క‌ల… Read More

May 17, 2024