Breaking: మార్గదర్శి సంస్థల అధినేత రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మార్గదర్శిలో అక్రమాలు జరిగాయంటూ కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేసిన ఏపీ సీఐడీ .. ఆ సంస్థ చైర్మన్, మైనేజింగ్ డైరెక్టర్ రామోజీరావు, శైలజాకిరణ్ లను విచారించింది.
తాజాగా మారగ్దర్శి కేసులో భారీగా ఆస్తులను ఏపి సీఐడీ అటాచ్ చేసింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్ మెన్, ఆడిట్ లు కుట్రతో నేరానికి పాల్పడినట్లుగా సీఐడీ తెలిపింది. మార్గదర్శి చిట్స్ ద్వారా సేకరించిన డబ్బును హైదరాబాద్ కార్పోరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది.
ఏపిలో 37 బ్రాంచ్ ల ద్వారా మార్గదర్శి వ్యాపారం చేస్తొందని పేర్కొన్న ఏపీ సీఐడీ ఏపిలో మార్గదర్శికి సంబంధించి 1989 చిట్స్ గ్రూప్ లు, తెలంగాణలో 2,316 చిట్స్ గ్రూపులు ఉన్నాయని చెప్పింది. ఖాతాదారులకు వెంటనే డబ్బులు ఇచ్చే స్థితిలో మార్గదర్శి లేదని ఏపి సీఐడీ తెలిపింది.