TDP Proddatur: ఉమ్మడి కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి నాలుగు స్తంబాలాట గా తయారైంది. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్ధిత్వాన్ని నలుగురు నేతలు ఆశిస్తున్నారు. ఎవరికి వారు టికెట్ తమదే అని భావిస్తున్నా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు వారిలో ఆందోళన కల్గిస్తున్నాయి. మరో పక్క క్యాడర్ కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్ధిత్వాలు ఖరారు చేస్తారని, ముందుగానే కోట్లాది రూపాయలు డిపాజిట్ చేయాలన్న కండిషన్ కూడా పెడుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఆశావహుల అనుచరుల్లో ఆందోళన నెలకొంటోంది.
మాజీ ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, మల్లెల లింగారెడ్డి లు టికెట్ తమదే అన్న ధీమాలో ఉన్నారు. మరో పక్క నాలుగేళ్లుగా నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డి టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారనీ, ఎవరూ పోటీ పడాల్సిన పని లేదని అంటున్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాననీ, జైలుకు కూడా వెళ్లాల్సిన వచ్చిందని ఆయన అంటున్నారు. ఓ పక్క ఈ ముగ్గురూ టికెట్ రేసులో ఉండగా, మరో పక్క పూర్వపు టీడీపీ నేత, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ తన సోదరుడు సురేష్ కు ప్రొద్దుటూరు టికెట్ ఇప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇలా నలుగురు పోటీ పడుతుండటంతో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న అయోమయం ఇటు నేతల్లో, అటు పార్టీ శ్రేణుల్లోనూ ఉంది.
సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కొద్ది రోజుల క్రితమే టీడీపీ లో యాక్టివ్ అయ్యారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని, గెలిపించాలని కోరుతున్నారు. గతంలో చంద్రబాబు కోటరీలో ముఖ్యమైన నేతగా ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇటీవలే తన సోదరుడు సురేష్ తో హైదరాబాద్ లో చంద్రబాబు ను కలిసి మాట్లాడారని ప్రచారం జరుగుతోంది. సురేష్ కు ప్రొద్దుటూరు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్ లు ఇస్తామని టీడీపీ పైకి చెబుతున్నా ఆర్ధికంగా బలవంతులు, ఎక్కువగా ఖర్చు పెట్టుకునే వారికే చంద్రబాబు టికెట్ ఇస్తారని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నారు. ఆర్ధికంగా చూసుకున్నట్లయితే సీఎం రమేష్ సోదరుడికే టికెట్ ఖరారు అయ్యే అవకాశం ఉంటుంది. టీడీపీ తరపున ఎవరు టికెట్ దక్కించుకున్నా ఈ నియోజకవర్గంలో టీడీపీకి విజయావకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు అంటున్నారు.
ఎందుకంటే ..ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఆర్ఎస్ సీపీకి కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం నుండి జరిగిన ఎన్నికల్లో కేవలం మూడు సార్లు 1983, 1985, ఆ తర్వాత 2009 లో మాత్రమే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు. 1989 నుండి వరుసగా నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ నుండి వరదరాజులు రెడ్డి విజయం సాధించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014, 2019 ఎన్నికల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్ధి మల్లెల లింగారెడ్డి పై ఏకంగా 45వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఈ నాలుగు స్తంబాలాటలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో తెలియాలంటే కొద్ది రోజుల వేచి చూడాల్సిందే.
AP Politics: ఏపీ ఎన్నికల్లో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు..ఏ పార్టీకి ప్లస్ .. ఏ పార్టీకి మైనస్..?
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More