(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు మనీ, మద్యం పంపిణీ లేని స్థానిక సంస్థల ఎన్నికలు చూడబోతున్నారు. ఇలా ఎన్నికలు జరిగితే స్థానిక నేతలకూ హాపీయే. ఎన్నికల్లో గెలవడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. రిజర్వుడ్ స్థానాల అభ్యర్థులకు ఈ ప్రక్రియ ఒక వరం లాంటిదే. గతంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే నాయకుల ఆర్థిక పరిస్థితి కూడా పార్టీ నేతలు పరిశీలించే వారు.
నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగితే అవినీతి రహిత సమాజం ఏర్పాటుకు దోహదం చేస్తుంది. ఎన్నికల్లో లక్షలు, కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థులు గెలిచిన తరువాత ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రాబట్టుకునేందుకు అవినీతి అక్రమాలకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి.
గతంలో ఒక కార్పోరేటర్ కోటి రూపాయల వరకూ, కౌన్సిలర్ 50 లక్షల వరకూ, గ్రామ సర్పంచ్ 25 లక్షల నుండి 50లక్షల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితులను మార్చి అవినీతికి ఆస్కారం లేకుండా ఎన్నికలు జరగాలన్నది జగన్ ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతోంది.
అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మార్పులు తీసుకువచ్చారు. ఎన్నికల ప్రక్రియ వ్యవధినీ 24 రోజుల నుండి 13నుండి 17 రోజులకు తగ్గించారు. అదే విధంగా ఎన్నికల ప్రచార కాలపరిమితిని అయిదు రోజుల నుండి ఏడు రోజులకు పరిమితం చేశారు. దీనికి తోటు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థులు మద్యం, డబ్బు పంపిణికి పాల్పడినట్లు రుజువు అయితే ఆ వ్యక్తులు గెలిచినప్పటికీ ఆ పదవుల్లో కొనసాగేందుకు అనర్హులుగా మార్చే విధంగా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. ఎన్నికల నియమావళి సెక్షన్ 211 ప్రకారం అక్రమ మార్గాల ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ ఓటర్లను ప్రలోభ పర్చడం, ఎన్నికల ప్రక్రియలో పాల్లొనకుండా చేయడం వంటి నేరాలకు పాల్పడితే మూడేళ్ల వరకూ జైలు శిక్ష, పదివేల రూపాయల వరకూ జరిమానా విధించేలా మార్పులు తీసుకువచ్చారు. ఇది ఒక విధంగా మంచి పరిణామమే అయినా కొన్ని వర్గాలను నిరాశకు గురి చేస్తుంది. ఎన్నికల సమయంలో నేతల వెంట తిరుగుతూ హంగామా చేసి నాలుగు చుక్కలు వేసుకునే మందు బాబులకు నిరాశే. మద్యం పంపిణీ చేసి, డబ్బు వెదజల్లి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించవచ్చనే ధీమా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇది ఆశనిపాతమే.
అయితే ఈ కఠిన నియమ నిబంధనలు అమలు అవుతాయా లేదా అన్నది అట్లా ఉంచితే ప్రతిపక్ష పార్టీ నేతలకు ఇప్పటి నుండే దడ పుడుతోంది. ఇప్పటికే అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేత, మాజీ ఎంపి జెసి దివాకరరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అనర్హత వేటు వేస్తామని అర్డినెన్స్ తీసుకొచ్చిన సిఎం జగన్మోహనరెడ్డికి హాట్సాఫ్ చెబుతూనే ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తామనీ అందులో ఎలాంటి సందేహం లేదనీ పేర్కొన్నారు. అయితే గెలిచిన తరువాత అభ్యర్థి మద్యం, డబ్బులు పంచారని అక్రమంగా కేసులు పెట్టి గెలిచిన పదవి ఊడగొట్టి రెండేళ్లు జైలుకు పంపే కొత్త చట్టాలను సిఎం జగన్ తీసుకువచ్చారనీ, అందుకు తాము సిద్ధంగా లేమనీ పేర్కొనడం గమనార్హం.
రాయలసీమలోని సీనియర్ నాయకుడే ఈ విధంగా వ్యాఖ్యానించడం ఆ పార్టీలోని ఇతర ప్రాంత నాయకులను నిరుత్సాహ పర్చడం ఖాయంగా కనబడుతోంది.
అయితే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలన్న ఎత్తుగడగా కాకుండా నిజాయితీగా అవినీతి రహితంగా ఎన్నికలు నిర్వహించాలని అధికారపక్షం వ్యవహరిస్తే ఇది ఆదర్శంగా నిలవడంతో పాటు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుందనేది జనం మాటగా వినబడుతోంది.
21 నుండి ఎన్నికలు
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న, మున్సిపల్ ఎన్నికలు 24న, పంచాయతీ ఎన్నికలు 27న నిర్వహించే అవకాశం ఉందని కేబినెట్ సమావేశంలో చర్చించారు.
శర్మ ఎస్ సోమరాజు
This post was last modified on March 6, 2020 8:39 am
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More