Karnataka CM: కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్ప మార్పు అంశం చాలా కాలంగా వార్తల్లో ఉన్నప్పటికీ ఆ వార్తలను ఆయన తొసిపుచ్చుతూ వచ్చారు. యడియూరప్ప వ్యతిరేక వర్గీయులు కేంద్ర నాయకత్వం వద్ద చక్రం తిప్పడంతో చివరకు యడియూరప్ప రాజీనామా చేయకతప్పలేదు. అయితే కర్ణాటకలో యడియూరప్ప మార్పునకు ముందు జరిగిన పలు ట్విస్ట్ లు, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. కర్ణాకట జనాభాలో లింగాయత్ వర్గానికి చెందిన వారు 18 నుండి 20 శాతం మంది వరకూ ఉంటారు. లింగాయత్ అనేది ఒక కులం కాగా దీన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. లింగాయత్ లలో 80 శాతం మందికిపైగా బీజేపీకి అనుకూలంగా ఉంటుంటారు. కర్ణాటకలో బీజేపీ గెలుపునకు ఈ కులానికి చెందిన ప్రదాన భూమికను పోషిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి బలం లేనప్పటికీ కర్ణాటకలో వీరి ప్రాబల్యం కారణంగా బీజేపీ గెటాన్ అవుతోంది. దాదాపు 50 నుండి 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో లింగాయత్ లు ఉన్నట్లు సమాచారం.
లింగాయత్ లలో ఎక్కువ మంది మఠాధిపతులుగా మారారు. అందు వల్లనే దేశం మొత్తంలో ఎక్కువ మఠాలు ఉన్నది కర్ణాటకలోనే అన్నది మన అందరికీ తెలిసిన విషయమే. మఠాలను నిర్వహిస్తున్న లింగాయత్ లు తమది ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్ప కర్ణాటక కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ ఏనాడూ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేదు. 2018 లోనూ యడియూరప్ప ప్రజల చేత ముఖ్యమంత్రి గా ఎన్నిక కాలేదు. 2018 ఎన్నికల్లో కర్ణాటకలో పూర్తి స్థాయి మెజార్టీ స్థానాలు బీజేపీ సాధించలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే నిలిచింది. జెడిఎస్, జేడియు కూటమిగా కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అధికార పార్టీ నుండి 16 మంది ఎమ్మెల్యేలను బీజేపిలో చేర్చుకుని వారితో రాజీనామాలు చేయించడం, ఆ తరువాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తదువరి రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఢిల్లీ రాజకీయాలు, ఏపి రాజకీయాలకు భిన్నంగా వెన్నుపోటు రాజకీయాలు కర్ణాటకలో స్పష్టంగా కనబడుతుంటాయి.
ఇకపోతే గత యడియూరప్ప గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రగా చేసినప్పటికీ ఈ టర్మ్ లోనే ఆయన ఎక్కువగా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. వందల కోట్ల డీల్స్ లో, ఐఎఎస్ ల బదిలీలలో యడియూరప్ప తనయుడు పేరు ప్రముఖంగా వినబడటంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. యడియూరప్ప వ్యవహార శైలి పై స్వపక్షంలోనూ అసంతృప్తి పెరిగిపోయింది. ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లగా యడియూరప్పపై అసంతృప్తితో ఉంది. అయితే కర్ణాటకలోని 400 మందికి పైగా మఠాధిపతులు మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ యడియూరప్ప పాలనను కీర్తించారు. యడియూరప్పనే సీఎంగా కొనసాగించాలంటూ కూడా వారు మాట్లాడటం గమనార్హం. అయితే యడియూరప్పను కొనసాగిస్తే రాష్ట్రంలో పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని భావించిన బీజేపీ అధిష్టానం సీఎం మార్పునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. చివరకు అధిష్టానం ఆదేశాలతో పదవిని వదిలిన యడియూరప్ప రాజీనామా లేఖ ఇచ్చిన తరువాత మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైయ్యారు. ఆ సమయంలో ఓ మఠాధిపతి యడియూరప్ప నుండి మైక్ తీసుకుని ఇక దేశంలో, రాష్ట్రంలో బీజేపీ నాశనం అయిపోతుందంటూ శాపనార్ధాలు పెట్టడం ప్రస్తావనార్హం. సో..ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి పార్టీ కంటే కులం, మతం, ప్రాంతమే ముఖ్యంగా కనబడుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా లింగాయత్ ల నుండి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్ బొమ్మైని సీఎంగా ఎంపిక చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లింగాయత్ లకు కాకుండా వేరే వారిని సీఎంగా ఎంపిక చేస్తే లింగాయత్ ల నుండి తీవ్ర తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. దాంతో బీజేపీ తీవ్రంగా నష్టపడే ప్రమాదం పొంచి ఉంది. దీన్ని గమనించిన బీజేపీ అధిష్టానం ఈ దిశగా చర్యలు తీసుకుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More