న్యూస్ చానళ్ళకు టీఆర్పీలు ఎలా సాధ్యమవుతాయి? బేగంపేట పబ్ దగ్గర జరిగిన సంఘటనలో బాధితురాలిని గంటల తరబడి ఎన్టీవీ లైవ్ చేసినట్టు అని జవాబివ్వకండి! జూన్ 20, గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఒకవైపు కాకినాడలో, మరోవైపు ఢిల్లీలో తెలుగుదేశం రాజకీయనాయకుల హడావుడి మొదలైంది. ఆ సమయంలో దాదాపు అన్ని చానళ్ళు స్పాన్సర్డ్ కార్యక్రమాల్లో మునిగివున్నారు. అవి వైద్యమో, కోచింగో, జ్యోతిష్యమో, వస్తువుల అమ్మకాలో… ఇలా అన్నమాట. ఎన్టీవి, సాక్షి, ఏబిఎన్, టీవీ-5 – దాదాపు ఎనిమిది తొమ్మిది పైగా న్యూస్ చానళ్ళు ఈ తరహా కార్యాక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. ఒకే ఒక టీవీ-9లో మాత్రం వార్తల బులెటిన్లో ఉంది. రాజ్యసభ సభ్యులు ముగ్గురు, నలుగురు పార్టీ వదులుతారా అని ఢిల్లీ నుంచి; ఓడిపోయిన కాకినాడ ప్రాంత నాయకుల భవిష్యత్ కార్యక్రమ ప్రణాళిక అంటూ కాకినాడ నుంచి వార్తలు కేవలం టీవీ 9 మాత్రమే ఇవ్వగలిగింది. మిగతా చానళ్ళకు ఇవి ముఖ్యమే కానీ ప్రారంభించిన కార్యక్రమం ఆపడం సాధ్యంకాదు గదా! ఈ సందర్భంలో మాత్రం కాకతాళీయంగా టీవీ-9 స్కోర్ చేసింది.
సిన్మా ఆడియో రిలీజు వేళ ఇటువంటిది ఎన్టీవీలోనో, టీవీ-9లోనో జరుగుతుంది. ఆ సమయంలో వారు ఎంత ముఖ్యమైన వార్తలు వచ్చినా, అవి కాకుండా తాము ఇవ్వాలనుకున్న కార్యక్రమం ప్రసారం చేస్తారు. ఇలా గమనించినపుడు ఎన్నికల సమయంలో ఈ డాక్టర్లు, కాలేజీ వాళ్ళు, స్వామీజీలు ఎందుకు సెలవు తీసుకుని పార్టీల ప్రచారానికి అవకాశం కల్గించారు అనే ప్రశ్న వస్తుంది. ప్రణాళిక ముందే ఉంటుంది కనుక లాభించి స్పాన్సర్డ్ కార్యక్రమాలు సైతం రద్దు చేసి పార్టీల ప్రచార కార్యక్రమాలు ఇస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రారంభోత్సవ సమయంలో సైతం చాలా చానళ్ళు చాలా కార్యక్రమాలు ఇచ్చి హడావుడి పెంచాయి.
తెలుగుదేశం ఎంపీలు పార్టీ వీడటం; బీజేపీలో చేరడం వంటి సంఘటనలు; జగన్మోహనరెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వంటి సందర్భాలలో టీవీ చానళ్ళలో చర్చలు ఆసక్తికరంగానే కాదు, చాలా సమయాలలో శిరోభారంగా మారుతున్నాయి. ఎన్టీవి, ఏపి 24 x 7 చానళ్ళు ఎక్కువమంది పానలిస్టులతో చర్చలు నిర్వహించడం బావుంటుంది. అయితే ఇటీవల తెలుగుదేశం, వైకాపా పార్టీ ప్రతినిధులు ఎక్కువ స్థాయిలో కేకలు వేసుకుంటున్నారు.
ఇలాంటి చర్చల సమయాల్లో యాంకర్లు మాటిమాటికి అడ్డుతగలడం పరిపాటి. ఒక్కసారి అసలు విషయం బోధపడక చక్కని విషయాలు చెప్పేవారికి అభ్యంతరం చెప్పి, చెప్పలేని వారిని దువ్వుతూ ఉంటారు. ఇటీవల తమిళ దర్శకుడు భారతీరాజా మద్రాసు తెలుగు సినీరంగపు వ్యక్తులపై నోరు పారేసుకున్నారు. నిజానికి ఇలాంటి విషయాలు మన చానళ్ళ దృష్టికి రావు. సినిమా విషయం కనుక టీవీ-5లో ఒక చర్చ చేశారు. విషయం మీద పూర్తి అవగాహన లేని మూర్తి అర్ధాంతరంగా చర్చలో అడ్డుతగిలి రసాభాస చేశారు.
టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాష్ వ్యవహారం ఇంకా తేలలేదు. హైకోర్టు పరిథిలో ఉంది. టీవీ-9కు స్ఫూర్తి అయిన ఎన్డి టీవీ ప్రణయ్రాయ్ ఇటీవల వార్తలకెక్కారు. 2008లో ఎన్డి టీవీలో 6.4 శాతం ఇండియన్ బుల్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు అమ్మారట. ఆరునెలల తర్వాత ఈ సంస్థ మరో 20.28 శాతం షేర్లు ఓపెన్ మార్కెట్లో కొన్నది. అయితే ఈ వ్యవహారాలు ‘సెబి’కి తెలపలేదని అభ్యంతరం వ్యక్తమయ్యింది. 12 లక్షలు జరిమానా విధించింది. అంతకు ముందు వారం మరో విషయం బయటకు వచ్చింది. ప్రణయరాయ్ దంపతులు ఒక రెండేళ్ళపాటు చానల్ బోర్డు కార్యకలాపాలలో పాల్గొనకూడదని సెబీ ప్రకటించింది. యాజమాన్యస్థాయికి ఎగబ్రాకిన జర్నలిస్టుల నైతిక వర్తనలోను, సంస్థల విధివిధానాలు పాటించడంలోను ఇటువంటి లొసుగులు తరచు వార్తలవుతున్నాయి. దీనివల్ల యాజమాన్యాలను తప్పుపట్టే నైతిక అధికారం జర్నలిస్టులు కోల్పోతున్నారు.
దూరదర్శన్ కాశ్మీర్ చానల్ ఆవిష్కరణ, తోగ్రీభాషలో న్యూస్బులిటిన్ ప్రారంభోత్సవం జూన్ 21న జరిగాయి. ఈ సమయంలో కేంద్రసమాచార ప్రసారశాఖామాత్యులు ప్రకాష్ జవదేకర్ ఇచ్చిన గణాంకాలు ఆసక్తిగా ఉన్నాయి.
* మనదేశంలో 25 కోట్ల కుటుంబాలుండగా, ఇప్పటికే 18 కోట్ల కుటుంబాలలో టీవీ సెట్లు ఉన్నాయి.
* దేశవ్యాప్తంగా ప్రస్తుతం 700 టీవీ చానళ్ళు వున్నాయి.
* దేశంలో 9 కోట్ల కుటుంబాలకు కేబుల్ టీవీ ప్రసారాలు అందుతున్నాయి.
* దేశంలో ప్రధాన కేబుల్ ఆపరేటర్లు ఐదారుమంది మాత్రమే ఉన్నారు.
* దూరదర్శన్కు నేడు మూడున్నర కోట్ల డిటిహెచ్ కనక్షన్లు ఉన్నాయి.
– డా. నాగసూరి వేణుగోపాల్
May 12: Daily Horoscope in Telugu మే 12 – వైశాఖ మాసం – ఆదివారం - రోజు… Read More
Rahul Gandhi: తన తండ్రి రాజీవ్ గాంధీకి, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు లాంటి వాడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ… Read More
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More