Pondicherry : పుదుచ్చేరి రాజకీయ సంక్షోభం అసలు కారణం!!

Published by
Comrade CHE

Pondicherry : దక్షిణ భారతదేశంలో అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటి పుదుచ్చేరి. ఇక్కడ ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మారుతున్న రాజకీయ ముఖచిత్రం తోపాటు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోపక్క పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ను కేంద్రం అకస్మాత్తుగా తొలగించి, ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్ తమిళ సై కు అప్పగించారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే మరో పరిణామం జరగడంతో కేంద్రపాలిత ప్రాంతంలో అసలు ఏం అవుతుందన్న సందిగ్ధం అంతటా వ్యక్తమవుతోంది. మరోపక్క కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ సరిగ్గా పుదుచ్చేరి పర్యటన పెట్టుకున్న సమయంలోనే వరుసగా ఈ పరిణామాలు జరగడం కాంగ్రెస్కు మింగుడు పడడం లేదు.

కొద్ది రోజుల్లో ఎన్నికలు!

పుదుచ్చేరి అసెంబ్లీ కు త్వరలో ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొనడం వరుసగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నాయి. నిజాయితీ గల అధికారి గా పేరు తెచ్చుకున్న కిరణ్ బేడి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అంతే చక్కగా పని చేశారన్న పేరు సంపాదించుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమె ను తొలగించడం వెనుక అసలు కారణాలు ఏమిటి అన్నది అంతుబట్టడం లేదు. దీనికి పలువురు పలు రకాల వ్యాఖ్యానాలు, ప్రచారాలు చేస్తున్నారు. దీని వెనుక కేంద్రం సాగించే రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ పలుకుతున్నాయి.

ఎప్పటి నుంచో సిఎంతో విభేదాలు

పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి లెఫ్ట్నెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కి మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. ఆమెను తొలగించాలని ముఖ్య మంత్రి నారాయణస్వామి పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కిరణ్ బేడి నియంతలా వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను సైతం అడ్డుకోవాలని చూస్తున్నారని, ఆమె పరిధులకు మించి వ్యవహరిస్తున్నారంటూ పలుమార్లు నారాయణస్వామి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతేకాదు కిరణ్బేడీ కు వ్యతిరేకంగా గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాలను ఏకంగా ముఖ్యమంత్రి చేశారు. దీనికి కాంగ్రెస్కు వామపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు. 2019 డిసెంబర్లో ఏకంగా రాజ్ భవన్ ఎదుట ముఖ్యమంత్రి ధర్నా కూడా చేశారు. ఇటీవల కాలంలో కిరణ్ బేడీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, ఆమె నియంత పొగడ మరింత ఎక్కువయిందని నారాయణస్వామి చెప్పడం విశేషం.
** ఇటీవల పుదుచ్చేరిలోని ప్రభుత్వ స్థలంలో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని కిరణ్బేడి అడ్డుకోవడం అప్పట్లో వివాదం అయింది. ప్రభుత్వ స్థలాల్లో ఇష్టానుసారం విగ్రహాలు ఏర్పాటు చేస్తే తర్వాత ఎంతో ఇబ్బంది అవుతుంది అని ఆమె వ్యాఖ్యానించారు. coffey టైంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రోజువారీ నివేదికలు సైతం లెఫ్ట్నెంట్ గవర్నర్గా తనకు అసలు రావడం లేదని ఆమె బహిరంగంగా చెప్పడం అప్పట్లో సంచలనం అయ్యింది.

మైనారిటీ లోకి ప్రభుత్వం

శాసనసభ్యులు వరుస రాజీనామాలతో పుదుచ్చేరి ప్రభుత్వం మైనారిటీలో పడినట్లు అయింది. శాసనసభ ఎన్నికలకు ముందే రాజకీయ సంక్షోభం తలెత్తే నట్లు అయింది. పుదుచ్చేరి శాసనసభలో మొత్తం సభ్యులు 30. ప్రభుత్వం ఏర్పాటుకు మ్యాజిక్ మార్కు 16. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే కలిపి 18 మంది బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో ఇటీవల మంత్రి నమశివాయ, ఎమ్మెల్యే తిపయన్ దాస్ కాంగ్రెస్కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. సోమ మంగళ వారాల్లో ఎమ్మెల్యేలు కృష్ణారావు, జాన్ కుమార్ లు రాజీనామాలు చేయడం ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. 18 మంది సభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నలుగురు సభ్యుల రాజీనామాతో 14కు బలం తగ్గింది. దీంతో ప్రభుత్వం సైతం మైనారిటీలో పడింది. దీంతో అసలు ఇప్పుడు పుదుచ్చేరిలో ఏం జరుగుతుంది అన్నది కీలకంగా మారబోతోంది.

This post was last modified on February 17, 2021 12:49 pm

Comrade CHE

Share
Published by
Comrade CHE

Recent Posts

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024