Prashant Kishor: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల వ్యూహకర్తగా పని చేయడమే దేశంలోని పలు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా బాధ్యతలు నిర్వహించి విజయాలు సాధించారు. తన నేతృత్వంలోని ఐప్యాక్ టీమ్ 2014 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ విజయానికి పని చేసింది. అయితే గత ఎన్నికల తర్వాత ఐప్యాక్ నుండి దూరంగా జరిగిన ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో బీహార్ ఎన్నికల్లో క్రియాశీల రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఆ రాష్ట్రంలో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆ క్రమంలో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
సాధారణ సామెతకు భిన్నంగా యథా ప్రజ … తథా నేత అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోయి ఓటేస్తే .. వారి నేత దొంగ కాకుండా హరిశ్చంద్రుడు అవుతాడా అని ప్రశ్నించారు. రూ.500 లకు ఓటును అమ్ముకున్నప్పుడు.. నేతను హరిశ్చంద్రులు అవుతారా అని ప్రశ్నించారు. ఓటరు అవినీతిపరుడైతే..రాజకీయ నేతలు కూడా అవినీతి పరులే అవుతారన్నారు. రూ.500లకు ఓటు అమ్ముకుంటే మీ నేత .. మీ గౌరవమర్యాదలను రూ.5 వేలకు అమ్ముకుంటాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చికెన్ బిర్యానీ, మద్యం బాటిల్ కు ఓటు వేసే వారికి నేతలను నిలదీసే అవకాశం లేదని అన్నారు. సమాజం ఎల ఉంటే నేతలూ అలానే ఉంటారని అన్నారు. ఓటు వేయడానికి నేతలు డబ్బులిచ్చినప్పుడు ఉచిత ప్రభుత్వ పథకాలకూ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తారని అన్నారు. ప్రజలు మాత్రం దొంగలుగా ఉండి నేతలను మాత్రం బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఓటు కోసం అందరూ డబ్బు తీసుకునే పరిస్థితి లేదు. పార్టీ కోసం డబ్బులు తీసుకోకుండా పని చేసే అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులే తాము ఎన్నికల్లో గెలవడానికి ప్రజలను ప్రలోభ పెట్టడానికి డబ్బులు పంచుతున్నారు కానీ ఓటర్లు అందరూ తమ ఓటును అమ్ముకోవడం లేదని అంటున్నారు. పోటీ చేసే అభ్యర్ధులు అందరూ ఏ పార్టీ వారు అయినా ఓటర్లకు డబ్బులు పంచకుండా ఉంటే ఓటర్లు తమకు ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మార్పు అనేది రాజకీయ నాయకుల్లో రాకుండా ఓటర్లలో రావాలని కోరుకోవడం అవివేకమే అవుతుంది.
Chandrababu Arrest: జగన్ కంటే ఎక్కువ వాళ్ళు పగ బట్టేసారు చంద్రబాబు మీద !
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More