Konijeti Rosaiah: స్వర్గస్తులైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంతటి ఉన్నత స్థానానికి చీరాల నుండే ఎదిగారు.గుంటూరు జిల్లా వేమూరు నుండి వచ్చిన రోశయ్యను చీరాల ప్రజలు అక్కున చేర్చుకుని అందలం ఎక్కించటం వల్లే ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు అన్నది నిర్వివాదాంశం.అందుకే రోశయ్య రాజకీయ చరిత్రలో చీరాలకో ప్రత్యేక అధ్యాయం వుంది.
విద్యాభ్యాసం అనంతరం రాజకీయ రంగప్రవేశం చేసిన రోశయ్య అడుగులు చీరాలవైపు పడ్డాయి. 1967 లో తొలిసారిగా ఆయన చీరాల నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు అయితే కాంగ్రెస్ అభ్యర్థి ప్రగడ కోటయ్య చేతిలో 1500ఓట్ల తేడాతో ఓడిపోయారు.అయినా చీరాలనే తన రాజకీయ స్థావరంగా మార్చుకొని ఆయన పని చేసుకుంటూ వెళ్లారు.తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్నారు.అన్ని వర్గాలకు చేరువయ్యారు.
చీరాల లో 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.అయితే 1994 ఎన్నికల్లో మాత్రం టిడిపి అభ్యర్థి పాలేటి రామారావు చేతిలో మూడువేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు.1996 లో ఆయన నర్సరావుపేట ఎంపీగా గెలుపొందారు.
1999 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన చీరాల రాకుండా సొంత ఊరైన వేమూరు నుండి పోటీ చేసి అక్కడ పరాజయం పొందారు.ఆ ఎన్నికల్లో చీరాల రాలలో బీసీకి చెందిన మహిళా అభ్యర్థికి సీటు ఇవ్వాలని సోనియా గాంధీ నిర్ణయించడంతో రోశయ్యకు అవకాశం రాలేదు.గోల్ అంజలీదేవికి చీరాల టిక్కెట్ రాగా ఆమెను పాలేటి రామారావు ఓడించారు.అలాగే రోశయ్య వేమూరులో పోటీచేసి ఓటమిపాలయ్యారు
2004 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి చీరాల చేరుకొని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పాలేటి రామారావును ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడించారు.తద్వారా పాలేటి మీద ప్రతీకారం తీర్చుకున్నారు.అయితే రోశయ్యకు వయసు మీద పడటంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక ప్రత్యక్ష ఎన్నికలు వద్దని సలహా ఇచ్చి ఆయనను శాసనమండలికి పంపారు.
రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన సీఎం అయ్యారు.ముఖ్యమంత్రిగా దిగిపోయాక తమిళనాడు గవర్నర్ అయ్యారు.పిసిసి అధ్యక్ష పదవిని కూడా నిర్వహించారు. ఇలా రోశయ్య ఎక్కని శిఖరాలు లేవు.కానీ చీరాల అందుకు మెట్లు పరిచింది.వేమూరు వారైనప్పటికీ చీరాల ప్రజలు రోశయ్యను వేరుగా చూడలేదు.ఈ రోజు రోశయ్య మరణవార్త విని చీరాల కన్నీరు పెడుతోందంటే ఆయనపట్ల ఇక్కడ ప్రజానీకానికి ఉన్న ప్రేమాభిమానాలను అర్థం చేసుకోవచ్చు..
This post was last modified on December 4, 2021 2:51 pm
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More