Categories: వ్యాఖ్య

మీడియం వివాదంలో మర్మం!

Published by
Siva Prasad

ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై ముందుకే నడవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్ణయించింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రిమండలి సభ్యులు ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని విమర్శిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన నాయకుడు పవన్   కల్యాణ్, ఈనాడు అధినేత రామోజీరావు వంటివారు లక్ష్యాలుగా ఈ దాడి సాగుతోంది. ఇంగ్లీషు చదువులు వారికేనా, బడుగులకు, దళితులకు అక్కర్లేదా అన్న రీతిలో వారి వాదన ఉంటోంది.

రామోజీరావు నడిపే రమా పబ్లిక్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియమే కదా? వెంకయ్య నాయుడు కుమార్తె నడిపే స్వర్ణభారతి ట్రస్టు కింద స్కూలులో ఏ మీడియం? టిడిపి గండిపేటలో నడిపే స్కూలులో ఇంగ్లీష్ మీడియం లేదా? నిజమే ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోనే చదువు చెబుతున్నారు. వాటి అధిపతులది రెండు నాల్కల ధోరణి అయితే దానిని ఎండగట్టాల్సిందే.

కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే వైసిపి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతానంటున్నది ప్రయివేటు పాఠశాలల్లో కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో.  ప్రభుత్వానికి సమాజం పట్ల రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఉంది. ప్రయివేటు వ్యక్తులకూ, సంస్థలకూ కూడా కొంత బాధ్యత ఉంటుంది. అయితే అది పరిమితం. ప్రభుత్వం బాధ్యత అలా కాదు. అది విశాలం. ప్రభుత్వం ఏ చర్య చేపట్టినా అది సమాజం హితం కోసమే అయిఉండాలి. ఇంగ్లీష్ మీడియం సమాజ హితం కోసం అని జగన్ ప్రభుత్వం వాదిస్తున్నది. ఇది నిజమా కాదా అన్నదే ఇక్కడ వివాదం. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లుగా పేదలు, వెనుకబడిన వర్గాల వారు, దళితులు ఎప్పటికీ వెనుకబడి ఉండాలన్నదే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారన్నది కాదు. వైసిపి మాత్రమే ఈ వర్గాల శ్రేయస్సు కోరుతుందనీ, వైసిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నవారంతా ఈ వర్గాలకు శత్రువులనీ చెప్పడం నవ్వుకోవడానికి కూడా పనికిరాని విమర్శ.

ఇక అసలు వివాదం గురించి ఆలోచిస్తే, ప్రాధమిక స్థాయిలో మాతృభాషలో చదివినందువల్ల విద్యార్ధుల అవగాహన పెరుగుతుందని చాలా అధ్యయనాల్లో రుజువైంది. ప్రాధమిక విద్యా బోధన అమ్మభాషలోనే ఉండడం వల్ల పిల్లల మానసిక వికాసం చక్కగా జరుగుతుందనీ, వారి సర్వతోముఖాభివృద్ధికి అది తప్పనిసరి అన్న వాదనకు రుజువుగా ప్రపంచ దేశాల్లో చాలా పరిశోధనలూ, అధ్యయనాలూ ఉన్నాయి. ఇంగ్లీష్  మీడియంలో చదవడం వల్ల పిల్లలకు లాభం ఎక్కువ అనేందుకు రుజువుగా ఎక్కడన్నా, ఎప్పుడన్నా ఏదయినా అధ్యయనం జరిగిందేమో ఆ మీడియం మద్దతుదారులు చెప్పాలి. అలాకాకుండా వద్దన్నవారిపై ఎదురుదాడికి దిగితే ప్రయోజనం ఉండదు.

ఇంగ్లీష్ మీడియం సమర్ధకుల వాదన అపోహలపై ఆధారపడిన వాదన. ఇంగ్లీష్ వస్తేనే రాణిస్తారన్న భావన తెల్లదొరలు దేశాన్ని వదిలివెళ్లిన దగ్గరనుంచీ భారతసమాజంలో ఉన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత అది మరింత బలపడింది. నిజానికి ఇంగ్లీష్ మీడియం వద్దనేవారు దానిని గుడ్డిగా వ్యతిరేకించేవారు కాదు. వారు కోరుతున్నది ప్రాధమిక విద్యాబోధన మాతృభాషలో జరగాలనే. కాలేజీ చదువులకు వెళ్లిన తర్వాత ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరూ అనరు. అన్నా ఎవరూ వినరు.

చరిత్ర వంటి సామాజిక శాస్త్రాలూ, జంతుశాస్త్రం, ఫిజిక్స్ వంటి విజ్ఞాన శాస్త్రాలను ప్రాధమిక స్థాయిలో అమ్మభాషలో వివరిస్తే పడే పునాదికి తిరుగు ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. దీనితో పాటు ఇంగ్లీష్‌ ధారాళంగా మాట్లాడడం లక్ష్యంగా ఆ భాషనూ నేర్పాలి. అలా అయితే కాలేజి చదువుల స్థాయిలో వెనకబడడం ఉండదు.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో మాతృభాష పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మాట్లాడడం తప్ప తప్పులు లేకుండా తెలుగులో రెండు వాక్యాలు రాయగలిగిన వారు పట్టభద్రులలోనే తక్కువ అయిపోయారు. సమాజానికి పట్టిన భాషా దారిద్ర్యం పత్రికారంగంలో బాగా చూడవచ్చు. రాయగలిగే వారు దొరకక సంపాదకులు నానాతిప్పలు పడుతున్నారు. కొన్నాళ్లు పోయిన తర్వాత  ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేయగలిగిన వారు అరుదైపోతారు. అప్పడిక గూగుల్ మీద ఆధారపడడమే.

తెలుగు భాషకి ఇలాంటి దుస్థితి ఉంటే మరి ఇంగ్లీష్ మాటేమిటి. దాని గురించి ఎంత తక్కువ చెబితె అంత మంచిది. పెద్దపెద్ద విద్యాసంస్థలను మినహాయిస్తే ఇంగ్లీష్ మీడియంలో చదివినవారు కూడా ఆంగ్ల భాషాజ్ఞానం విషయంలో నానాటికీ తీసికట్టుగా తయారవుతున్నారు. దీనికి కారణం విద్యా సంస్థలలో దొరుకుతున్న నాసిరకం చదువు. నాణ్యత లేని చదువు ప్రభుత్వ విద్యా సంస్థలలోనే అనుకుంటే పొరపాటే. ఎక్కువ భాగం ప్రయివేటు విద్యాసంస్థలది కూడా అదే పరిస్థితి. సరైన విద్యార్హతలు, సరైన శిక్షణ లేని టీచర్లు ఇందుకు ప్రధాన కారణం. సరైన సదుపాయాలు లేకపోవడం కూడా కారణమే.  వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలవడం అంటూ జరిగితే  ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాలు చేస్తున్న టీచర్ల దగ్గర చదువుకునే పిల్లల గురించి తలచుకుంటేనే భయం వేస్తున్నది.

దేశంలో విద్యారంగంపై ప్రభుత్వాలు ఖర్చు చేసే నిధుల గురించి  అనుకోవడం కూడా అనవసరం. ఈ అంశాలన్నిటినీ వదిలిపెట్టి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సర్వరోగ నివారిణి అన్న పద్ధతిలో ప్రచారం చేయడం మంచిది కాదు. ఈ అంశంపై సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయడం ఏమాత్రం మంచిది కాదు. విద్యను రాజకీయాలకు వాడుకోవాలన్న ఆలోచన సమాజ ఆరోగ్యాన్ని మరి బాగుపడని  విధంగా చెరుపుతుంది.

 

ఆలపాటి సురేశ్ కుమార్

This post was last modified on November 14, 2019 4:52 pm

Siva Prasad

Recent Posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More

May 9, 2024

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More

May 9, 2024

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More

May 9, 2024

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

రాజ‌కీయాలంటే రాజ‌కీయాలే. చ‌ప్ప‌గా చేస్తామంటే కుద‌ర‌దు. ప్ర‌త్య‌ర్థి ఎత్తుగ‌డ‌లు.. లోతుపాతులు గుర్తిం చి ఇవ‌త‌ల ప‌క్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More

May 9, 2024

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More

May 8, 2024

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More

May 8, 2024

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More

May 8, 2024

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More

May 8, 2024

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More

May 8, 2024

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More

May 8, 2024

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More

May 8, 2024

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More

May 8, 2024

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More

May 8, 2024

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More

May 8, 2024