ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం ఘటన ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిన విషయమే. భక్తుల దగ్గర నుంచి హైందవ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ ఈ అంశంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. ఘటనపై నిగ్గు తేల్చాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఈ సెగ ఏపీ ప్రభుత్వాన్ని తాకింది. దీంతో ప్రభుత్వం స్పందించింది. అధికారుల సస్పెన్షన్, దేవాదాయ శాఖతో ఇన్వెస్టిగేషన్, కొత్త రధానికి నిధులు.. ఇలా సీరియస్ గానే స్పందించింది. అయితే.. రాజకీయంగా మలుపులు తీసుకుంటున్న ఈ అంశంపై ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని ఏకంగా సీబీఐ ఎంక్వైరీ చేయించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన జీవో కూడా విడుదలైంది. ఈ అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు.
హర్షకుమార్ ఏమన్నారంటే..
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. రాజకీయ పార్టీలు స్వలాభం కోసమే విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. అంతర్వేది రాజోలు నియోజకవర్గంలో ఉందని.. అక్కడ జనసేన రెబల్ ఎమ్మెల్యే ఉండటం వల్లే జనసేన, బీజేపీలు దీనిని రాజకీయం చేస్తున్నాయని విమర్శలు చేశారు. కాపుల్లో బలపడాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ను రంగంలోకి దించి నియోజవర్గంలో కాపుల్ని రెచ్చగొడుతున్నారని అభిప్రాయపడ్డారు. ప్రస్తత అంశాన్ని అవకాశంగా తీసుకుని మతం మీద అభిమానంతో బీజేపీ.. కులం అభిమానంతో జనసేన వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. కులాభిమానం ఎక్కువగా ఉన్న సోము వీర్రాజుకి చిరంజీవిని సీఎం చేయాలనే లక్ష్యంతో ఉన్నారని అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారారంటూ ఎద్దేవా చేశారు.
కులానికో రకంగా వ్యవహరిస్తున్నారు..
ఇదే జిల్లాలో దళిత యువకుడికి శిరోముండనం చేయిస్తే ప్రభుత్వం సీబీఐతో విచారణ ఎందుకు చేయించట్లేదని ప్రశ్నించారు. కులాన్ని బట్టి సీఎం జగన్ తీరు ఉంటోందని మండిపడ్డారు. సీతానగరం శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించి సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. హర్షకుమార్ వ్యాఖ్యలతో రథం దగ్ధం అంశం రాజకీయంగా మరో మలుపు తీసుకుంటుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి. రథం అంశాన్ని తీసుకుని కులం, రాజకీయం, శిరోముండనం ఘటనను తెర మీదకు తీసుకొచ్చారు. సీఎంను ఇరుకున పెట్టేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ పార్టీలన్నింటినీ దూనమాడిన హర్షకుమార్ టీడీపీపై మాత్రం ఎటువంటి విమర్శలు చేయలేదు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More
Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More
SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More
EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More
Lok Sabha Elections 2024: ఈశాన్య ఢిల్లీ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కన్హయ్య… Read More
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More