అమరావతి: చిన్న వయసులో ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించి పదవీ బాధ్యతలు మోస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతీరును రాష్ట్రం అంతా గమనిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆయన నేపధ్యం, ఆయన వయస్సు అందరి దృష్టీ జగన్ మీదే కేంద్రీకరించేట్లు చేశాయి. తనను అందరూ గమనిస్తున్నారన్న విషయం జగన్కు తెలుసు. అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తాను పదవిలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మొదటి కలక్టర్ల సమావేశంలో జగన్ తన ఆలోచన ఎలాంటి ధోరణిలో నడుస్తుందో సూచించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వలోని గత ప్రభుత్వం చేసిన తప్పులు తాను చేయకూడదన్న ఆలోచన మొదటగా కనబడుతోంది.
గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటయిన జన్మభూమి కమిటీల వల్ల అధికారపక్షం టిడిపి ప్రజల్లో వ్యతిరేకత మూటకట్టుకున్న సంగతి జగన్కు తెలుసు. తన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ విషయాన్ని టిడిపిపై దాడికి ప్రధానంగా వాడుకున్నారు. ఇప్పుడు అదే తప్పు వైసిపి కూడా చేస్తే టిడిపికి పట్టిన గతే తమకూ పడుతుంది కాబట్టి సంక్షేమ పధకాల విషయంలో స్వపర బేధం లేకుండా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇక అవినీతి విషయం. స్వయంగా జగన్పై సిబిఐ, ఇడి పెట్టిన అవినీతి కేసులు ఉన్నాయి. ఈ విషయంలో తనపై పడిన ముద్రను చెరిపేసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు. కేసుల విషయం న్యాయస్థానాలు చూసుకుంటాయి కాబట్టి తన పాలనకు మాత్రం అవినీతి మరక అంటకుండా చూసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకే పదేపదే అవినీతిని సహించేది లేదన్న సందేశం పంపుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడిందని జగన్ ఎన్నికల ముందు పదే పదే ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలను నమ్మించడంలో ఆయన కొంతవరకూ కృతకృత్యులయ్యారు కూడా. క్షేత్రస్థాయిలో టిడిపి శాసనసభ్యులు చాలామంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన నేపధ్యంలో ప్రజలలో అధికారపక్షం పట్ల వ్యతిరేకత వచ్చింది. తన హయాంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు.
ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు చేసిన తప్పులు తాను చేయకుండా ఉండడం ద్వారా ఆయన రెండు ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఒకటి మంచి పాలకుడని ప్రజలలో పేరు తెచ్చుకోవడం. రెండు చంద్రబాబును మరింతగా ఆత్మరక్షణలో పడవేయడం. తద్వారా ఆయనను, ఆయన పార్టీని నైతికంగా దెబ్బతీయడం. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అన్న పేరు తెచ్చుకుంటానని మొదటే ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు.
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More
Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More