AP CM Jagan: నేడు, రేపు జనం మధ్యలో జగన్.. ! పర్యటన సాగేదిలా..!!

Published by
sharma somaraju

AP CM Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు, రేపు వరద ప్రభావిత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. వరద ప్రభావంతో మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో సహాయక చర్యలు ఆరా తీయడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాజెక్టులను సీఎం జగన్ స్వయంగా పరశీలించనున్నారు.

AP CM Jagan Kadapa, Chittoor tour

AP CM Jagan: గురువారం (నేడు) పర్యటన ఇలా..

ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి కడప జిల్లా బయలుదేరి వెళతారు. 10.30 గంటలకు కడప జిల్లా మందపల్లి చేరుకుంటారు. అక్కడ నుండి సీఎం జగన్ పుల్లపొత్తూరు గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి సహాయ శిబిరంలో బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు పుల్లపొత్తూరు గ్రామ సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ నుండి ఎగుమండపల్లి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం వరదలకు దెబ్బతిన్న అన్నమయ్య డ్యామ్ ను పరిశీలించనున్నారు. ఈ సందర్భంలో వరద ప్రభావం ఫలితంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందజేయనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు మండపల్లి చేరుకుని వరద నష్టం, అనంతర సహాయ చర్యలపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ రేణిగుంట మండలం వేదలచెరువు, ఎస్టీ (యానాది) కాలనీకి చేరుకుని కాలనీ వాసులతో ముఖాముఖి, సమీక్ష నిర్వహించనున్నారు. 4.40 గంటలకు ఏర్పేడు మండలం పాపనాయుడు పేట గ్రామానికి చేరుకుని వరద నష్టాన్ని పరిశీలిస్తారు. అక్కడ నుండి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్ రోడ్డు వద్ద వరద నష్టంపై బాధితులతో మాట్లాడనున్నారు. తదుపరి పద్మావతి అతిధి గృహానికి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు వరద నష్టం, సహాయ పునరావాసంపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలో సీఎం జగన్ బసచేయనున్నారు.

శుక్రవారం పర్యటన  ఇలా..

తిరుపతి కృష్ణానగర్, ఆటోనగర్ లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు నెల్లూరు జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గంలో పర్యటించి వరద సహాయ చర్యలను సమీక్షించి బాధితులను పరామర్శించనున్నారు. తరువాత పెన్నా నదీ వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను, వ్యవసాయ పంటలను సీఎం జగన్ పరిశీలించనున్నారు. 1.15 గంటలకు నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో బాధిత కుటుంబాల పరామర్శ. అనంతరం అధికారులతో సమీక్ష చేయనున్నారు. తరువాత 3.20 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 4.20 గంటలకు రేణిగుంట నుండి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లికు చేరుకోనున్నారు.

This post was last modified on December 2, 2021 12:27 am

sharma somaraju

Recent Posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More

May 4, 2024

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More

May 4, 2024

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

Jagadhatri May 4 2024 Episode 222:  నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More

May 4, 2024

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More

May 4, 2024