Janasena: జనసేనకు ఝలక్ ఇచ్చారు పొన్నూరు వైసీపీ నేతలు షాక్ ఇచ్చారు. వైసీపీ నేతలు రాత్రికి రాత్రి హెలిప్యాడ్ ను ధ్వంసం చేశారు. దీంతో పొన్నూరులో జనసేన మరో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు విస్తృతంగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాఫ్టర్ లలో చెక్కర్లు కొడుతూ నిత్యం రెండు మూడు సభల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు (ఆదివారం) గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. ఆదివారం ఉదయం 9 గంటలకు పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం జనసేన నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ అనుమతుల కోసం కూటమి నేతలు దరఖాస్తు చేసుకున్నారు.
ఇటీవల సీఎం జగన్ పొన్నూరులో బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా స్థానిక సజ్జా ఫంక్షన్ హాలు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది ఖాళీగా ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ల్యాండ్ కావాలని అధికారులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు.. తాము ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను ఎలా వాడుకుంటారంటూ రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. ఈ పరిణామంతో జనసేన నేతలు హెలిప్యాడ్ కోసం మరో స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి