AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ పర్యటన ఖరారు కాగా.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్ కూడా ఖరారు అయ్యింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కంటే ముందుగానే అమిత్ షా రాష్ట్రంలో ప్రచారానికి వస్తున్నారు. 5వ తేదీ ఆదివారం (రేపు) రాయలసీమలోని ధర్మవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వస్తున్నారు. కూటమి తరపున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి, పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు మద్దతుగా అమిత్ షా ప్రచారానికి వస్తున్నారు.
ఆదివారం (రేపు) ధర్మవరానికి అమిత్ షా వస్తున్నట్లు తమకు సమాచారం వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఢిల్లీ నుండి ధర్మవరం చేరుకోనున్న అమిత్ షా . సత్యకుమార్ కు మద్దతుగా ధర్మవరం బత్తలపల్లి రోడ్డులోని సీఎస్బీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అమిత్ షా తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ సభలో పాల్గొననున్నారు.
మరో వైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం (ఎల్లుండి) రాష్ట్రానికి విచ్చేస్తున్నారు. మే 6న (సోమవారం) ఢిల్లీ నుండి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో ప్రధాని మోడీ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సభా వేదిక ఏర్పాటు చేస్తున్న వేమగిరికి చేరుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుండి హెలికాఫ్టర్ లో అనకాపల్లి వెళతారు. అక్కడ రాత్రి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీ కి వెళ్లిపోతారు.
అనంతరం తిరిగి మే 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంటకు రానున్న ప్రధాని మోడీ.. 3 గంటలకు పీలేరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుండి సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయవాడకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. తదుపరి ఢిల్లీకి వెళ్లిపోనున్నారు.
Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు