Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని శ్యామ్ అంటాడు. నన్ను తిట్టిన పర్వాలేదు మిమ్మల్ని పండుని తిడితే నాకు బాధ కలుగుతుంది అందుకే వద్దంటున్నాను అని రుక్మిణి అంటుంది. సరే రుక్మిణి నువ్వు చెబుతున్నావ్ కాబట్టి ఈ సారికి రాదని వదిలేస్తున్నాను ఇంకెప్పుడైనా నిన్ను తిట్టిందని తెలిసిందో ఆ రాధను క్షమించను అని శ్యామ్ అంటాడు. మీ దాకా ఎందుకులెండి ఆ రాధ కి నేనే బుద్ధి చెప్తాను అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, రాధా వెళ్తూ ఉండగా విరాజ్ ఎదురవుతాడు. ఎందుకు నా వెంట పడుతున్నావ్ అని రాధ అడుగుతుంది. అరె తెలిసినవారు అని పలకరించాను తప్పేంటి మేడం అని వీరాజ్ అంటాడు. నీలాంటి మోసగాడితో నేను మాట్లాడను అని రాదా కోపంగా వెళ్ళిపోతుంది. రాధ వెళుతూ ఉండగా విరాజ్ తన వెనకాల వెళుతూ ఉంటాడు.
ఇతనేంటి నన్ను ఫాలో అవుతున్నాడు అని రాధ ఇతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకొని రాదా ప్రసాద్ రావు ఇంట్లోకి వెళుతుంది. అంకుల్ ఒక దొంగ వెధవ నన్ను వెంబడిస్తున్నాడు అతన్ని పట్టుకొని తన్నాలి అని రాధ అంటుంది. నీకేం భయం లేదు లే అమ్మ వాడు మన ఇంటికి రాడు అని ప్రసాద్ రావు అంటాడు. లేదు అంకుల్ అతను వస్తున్నాడు అని రాదా భయపడుతుంది. రాజి నువ్వు వెళ్లి బెడ్ షీట్ తెచ్చి మూసుగయ్ నిన్ను కర్ర తెచ్చి వాడిని కొడతాను అని ప్రసాద్ తీసుకొస్తాడు. విరాజ్ ఇంట్లోకి రాగానే రాజీ ముసుగేస్తోంది ప్రసాద్ రావు కొడతాడు. డాడీ ఆపండి ఎందుకు కొడుతున్నారు అని విరాజ్ అంటాడు. నా కొడుకు మాటల వినిపిస్తుంది ఏంటి అని మూసుగు తీసి చూసేసరికి విరాజ్. ఇంతసేపు దొంగ వెధవ అన్నావు నీ వెంట పడుతుండన్నా వీడేనా అమ్మ అని ప్రసాద్ రావు అంటాడు. అవును అంకుల్ ఇతను నీకు తెలుసా అని రాధ అంటుంది. వీడు నాకు ఒక్కగానొక కొడుకమ్మా నీకు దెబ్బలు ఏమైనా తగిలాయ అని ప్రసాద్ రావు అంటాడు. సారీ అంకుల్ మీ అబ్బాయి అనుకోలేదు అనుకోకుండా ఇలా జరిగిపోయింది అని రాధ అంటుంది.
తెలిస్తే ముసుగేసి కొట్టించేవారు కాదు అని విరాజ్ అంటాడు. డాడీ రాధా తప్పు కాదు నీ తప్పు ఉంది ఎవరో ఏంటో తెలుసుకోకుండా ముసుగేసి కొట్టడమేనా అని విరాజ్ అంటాడు. అంకుల్ తప్పేమీ లేదండి తప్పంతా నాదే అని రాధా అంటుంది. రాధా జరిగిన విషయం అంతా ప్రసాద్ రావుకి చెబుతుంది. అలా పొరపాటు పడ్డాను అంకుల్ అని రాదా అంటుంది. పొరపాటు పడితే మాత్రం మా వాళ్లతో చెప్పి నన్ను కొట్టిస్తావా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు వీరాజ్. సారీ అంకుల్ అని రాధ అంటుంది.నువ్వు మంచి దానివే వాడు మంచివాడే పర్వాలేదు లేమ్మా వాడికి పెళ్లి చేస్తే చాలు అని ప్రసాద్ రావు అంటాడు.మీరేమీ భయపడకండి అంకుల్ మీ అబ్బాయిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించి మీ ఇంటికి కోడల్ని తీసుకొస్తాను అని రాదా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, రాధా రోడ్డుమీద అనవసరంగా విరాజిని తప్పుపట్టాను అని ఆలోచిస్తూ వస్తూ ఉండగా రుక్మిణి ఎదురవుతుంది. ఏంటి అంత తల పొగరుగా ఉన్నావు నిన్న రెస్టారెంట్ లో ఇచ్చిన గిఫ్ట్ సరిపోలేదా అని రాదా అంటుంది.
నీకు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని వచ్చాను రాదా ఇవేంటో తెలుసా ఫ్లైట్ టికెట్లు ఇవి ఎందుకో తెలుసా నేను నా భర్త హనీమూన్ కి వెళ్తున్నాం బహుశా మేము తిరిగి వచ్చేసరికి నువ్వు ఉండవేమో అని రుక్మిణి అంటుంది. ఉంటాను నీ మొదటి భర్తనే రెండు సరి పెళ్లి చేసుకుని రెండోసారి హనీమూన్ కి వెళ్తున్న నీకు మంగళ హారతి ఇవ్వడానికి కాదు మ్యారేజ్ బ్యూరో పెట్టి అంచలంచలుగా ఎదిగి నన్ను గుండెల మీద తన్ని నీ భర్తని బిడ్డని సొంతం చేసుకున్నావు నువ్వు నన్ను చూసి ఇది ఇంతలా ఎలా ఎదిగిందని బాధపడేలా చేయడానికి ఇక్కడే ఉంటాను అని రాధా అంటుంది.
ఈసారైనా నీ భర్తతో సంతోషంగా హనీమునికి వెళ్లి రా ఆల్ ద బెస్ట్ అంటూ రాధా వెళ్లిపోతుంది. నువ్వు ఎదగడం చూసి నేను బాధపడడం కాదే పాపం నేను వచ్చేసరికి నువ్వే ప్రాణాలతో ఉండవు అని రుక్మిణి అనుకుంటుంది. కట్ చేస్తే మధురా గుడికి వెళ్లి పూజ చేయిస్తుంది. శ్యామ్ అక్కడికి వచ్చి మధుర తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావురా రాధని ఇంకా ఎలా బాధ పెట్టాలని చూస్తున్నావా అని మధుర ఉంటుంది. అమ్మ నేను చెప్పేది ఒకసారి వినమ్మ అని శ్యామ్ అంటాడు.ఏంచెబుతావురా ఒకే కొబ్బరి బొండాలో రెండు స్ట్రాలు
వేసుకుని రుక్మిణితో ఎంత ప్రేమగా తాగుతున్నావో చెబుతావా అని మధుర వెళ్ళిపోతుంది. అమ్మ ఒక్కసారి నేను చెప్పేది విను అమ్మ అని శ్యామ్ వాళ్ళ అమ్మకి అడ్డంగా నిలబడి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పాదాల సాక్షిగా దైవ సన్నిధిలో ఉండి చెబుతున్నాను అమ్మ నేను రుక్మిణితో ప్రేమగా ఉన్నట్టు నటించకపోతే రాదని చంపేస్తుంది అమ్మ అ రుక్మిణి అని శ్యామ్ అంటాడు…