Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని గౌతమ్ అనుకుంటాడు. మాలినికి అబార్షన్ అనుకోకుండా జరిగిందా అనుకోని జరిగిందా అనే విషయాన్ని వదిలేయండి జరిగి పోయిందాన్ని మనం ఎవరు వెనక్కి తీసుకురాలేం అని అంటాడు అరవింద్. నేను రాలేను నాకు ముఖ్యమైన వర్క్ ఉంది అని గౌతమ్ అంటాడు. మీ వల్లనే మాలినికి మల్లికి దూరం పెరిగింది ఒక తల్లికి పుట్టక పోయిన ఒక తండ్రికి పుట్టిన అక్క చెల్లెలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అలాంటిది ఇప్పుడు శత్రువులు అయిపోయారు ఆ శత్రుత్వం మెల్లగా అనుబంధంగా మారాలి అంటే మీరు వస్తూ పోతూ ఉండాలి అప్పుడే రెండు కుటుంబాలు బాగుంటాయి అర్థం చేసుకో గౌతం అని అరవింద్ అంటాడు. నేను రాను అని గౌతమ్ అంటాడు. మీరు చేసిన తప్పుకి నన్ను దోషిగా మాట్లాడుతున్నారు మనం ఎలాగైనా వెళ్లాలి అని మల్లి అంటుంది.
అరవింద్ గౌతమ్ ని హగ్ చేసుకొని రిమోట్ మల్లి చేతుల్లో ఉంది మల్లిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు ఇకనుంచి నీకు ఉంటుంది అని అరవింద్ చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, మాలిని తన గదిలో కూర్చుని ఉండగా వసుంధర దగ్గరికి వచ్చి అరవింద్ కి మైండ్ సరిగా పనిచేయడం లేదా ఆ మల్లి వల్ల గౌతమ్ వల్ల మీ బిడ్డ చనిపోయింది అని స్పృహ ఉందా అవన్నీ మర్చిపోయి బర్త్డే సెలబ్రేషన్స్ కి వాళ్లను ఎందుకు పిలిచాడు అని వసుంధర అంటుంది. ఆపడానికి నేను ప్రయత్నించాను కానీ తను వినలేదు బర్త్డే రోజు తను ఎందుకు బాధ పెట్టడం అని ఆగిపోయాను అని అంటుంది మాలిని.
నాకు ఈ గొడవలు పెద్దగా ఇష్టం లేదు నువ్వు కూడా సైలెంట్ గా ఉండు అని అంటుంది మాలిని. నేనెలా సైలెంట్ గా ఉండగలను వసుంధరను అయితే విధ్వంసం చేసేదాన్ని పోనీలే అని వదిలేస్తున్న కొద్ది వాళ్ళిద్దరూ ఇంకా రెచ్చిపోతున్నారు అసలు ఆ మల్లికి ఇంత విషం పెట్టి చంపేస్తే కాని మీ సంసారం బాగుపడేలా లేదు వాళ్ల వల్ల సమస్యలు మొదటికి వస్తున్నాయి అని వస్తుందరా అనగానే అవి వింటున్న మీరా అమ్మగారు అని గట్టిగా అరుస్తుంది.
నా బిడ్డకు విషం పెట్టి చంపేయాలని అంత కోపం ఎందుకు అని అడుగుతుంది. విషం పెట్టి చంపేయడం కూడా దానికి మంచిదవుతుంది దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలి అని అంటుంది వసుంధర. ఎప్పుడైతే మా మల్లి చస్తుందో అప్పుడు మాకు మనశ్శాంతి దొరుకుతుంది అని వసుంధర అనగానే శేఖర్ వచ్చి నీ కూతురుకి ఇంకో జన్మనిచ్చింది అలాంటి మనిషి గురించి ఇలా మాట్లాడతావా అని అంటాడు శేఖర్. దాని జీవితమే ఏడ్చేయాలా ఉంది అలాంటిది ఇంకొకరి జీవితానికి పునర్జన్మని ఇచ్చిందా అని అంటుంది వసుంధర. నీకు చెడు చేసిన వాళ్ళని చాలా కాలం గుర్తుపెట్టుకుంటావు కానీ నీకు మంచి చేసిన వాళ్ళని ఇలా తొందరగా మర్చిపోతావ్ అని శేఖర్ అంటాడు. కూతురి కడుపు పోయింది అన్న బాధ మీలో కొంచమైనా ఉందా దానికి కారణం అయిన మల్లి మీద కొంచమైన కోపం ఉందా,మీరా నీకు మల్లి పుట్టకుండా ఎవరైనా చేసి ఉంటే అప్పుడు తెలిసేది నా కూతురు బాధేంటో అని వసుంధర అంటుంది. వసుంధర ఇక చాలు మల్లి గౌతమ్ వచ్చారు పదండి వెళ్దాం అని శేఖర్ అంటాడు. వాళ్లు వస్తే నాకేంటి అని అంటుంది వసుంధర.
ఈ గొడవ రేపటికి వాయిదా వేసుకో అప్పుడు గొడవ పడదాం ఇప్పుడైతే అందరూ నడవండి అని శేఖర్ మీరాను తీసుకొని వెళ్ళిపోతాడు. పిలవగానే వచ్చినందుకు చాలా థాంక్స్ గౌతమ్ దీన్నిబట్టి నాకు మల్లి గౌతమ్ ని కొంగున ముడేసుకుంది అని అర్థమైంది అని అంటాడు అరవింద్. ఆడవాళ్ళ మాటలు వింటే మగవాళ్ళు బాగుపడతారని గౌతమ్ కి తెలిసినంతగా నీకు తెలియదు అరవింద్ అని మాలిని అంటుంది. గౌతమ్ ని చూసి నేర్చుకుంటానులే మాలిని అని అంటాడు అరవింద్. ఒకర్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరమేముంది అరవింద్ నువ్వు అసలే సీనియర్ జర్నలిస్ట్ వి నీకు అన్నీ తెలుసు అని గౌతమ్ అంటాడు.అరవింద్ కోసం మీరు ఏమి బహుమతి తెలియదా అని మాలిని అడుగుతుంది. గౌతమ్ రావడమే నాకు పెద్ద బహుమతి అని అరవింద్ అంటాడు. మీరేమీ మందు పెట్టారో కానీ నా అల్లుడు మీరు లేకుండా అసలు ఏ ఫంక్షన్ చేయడం లేదు అని అంటుంది వసుంధర. మీరు నా కూతురు దగ్గర నుండి మంచితనం నేర్చుకోండి అని అంటుంది మీరా. నేర్చుకుంటాను బదులుగా తిరిగి ఇవ్వాల్సినవి వడ్డీతో సహా ఇస్తాను అని అంటుంది వసుంధర.
మీరు మాట్లాడుతూ ఉండండి నేను గౌతమ్ ఇప్పుడే వస్తాం అని పైకి వెళ్తారు. ఏ ఫంక్షన్ కైనా నువ్వు రావాల్సిందే నేను చేసే టార్చర్ ను అనుభవించాల్సిందే అని అంటాడు అరవింద్. ఎందుకు పిలిచావో ముందు ఆ విషయం చెప్పు అని అంటాడు గౌతం. నేను మాలిని ఏది కోల్పోయాము నువ్వు కూడా అది ఈరోజు కోల్పోబోతావు అని అరవింద్ వెళ్లిపోతాడు. మీరా మల్లిని పక్కకు తీసుకెళ్లి నువ్వు ఇంటికి రాకపోవడమే మంచిది వసుంధర అమ్మగారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు నిన్ను చంపడానికి ఇంకా బతికి ఉన్నట్టుగా అనిపిస్తుంది అని మీరా అంటుంది. అలా రాకుండా ఇంకా దూరంగా ఉంటే బంధాలు దూరమవుతాయి అని శేఖర్ అంటాడు. మాలిని అక్క నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటుంది అని మల్లి అంటుంది. గౌతమ్ వచ్చి మల్లి మనం ఇంటికి బయలుదేరుదామా అని అడుగుతాడు. కేక్ కటింగ్ వరకు ఉండండి అని అంటాడు శేఖర్. ఉండాలని అనిపించడం లేదు మామయ్య అని గౌతమ్ అంటాడు. మనమందరం హాల్లోకి వెళ్దాం పదండి అని అంటాడు శేఖర్. నాకు కొంచెం దాహం గా ఉంది నేను మంచినీళ్లు తాగి వస్తాను అని మల్లి వెళ్తుంది.