Road Accident: కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ దంపతులతో పాటు వారి మూడు నెలల మనవడు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదంద్రుడు తీవ్ర గాయాలపాలయ్యారు. అంటారియోలో ఓ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులు పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో హైవేపై వ్యాన్ లో రాంగ్ రూట్ లో వెళుతూ పలు కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
మృతులను మణివణ్ణన్, మహాలక్ష్మి గా గుర్తించారు. మనవడిని చూసేందుకు వారు కెనడా వెళ్లినట్లుగా తెలిసింది. చిన్నారి తల్లిదండ్రులు ఎజాక్స్ లో నివాసం ఉంటున్నారు. ఘటనపై టొరొంటోలోని భారతీయ కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది. భాధిత కుటుంబానికి సంతాపం తెలియజేసింది. ఈ ఘటనపై కెనడా అధికారులతో సంప్రదింపుల్లో ఉన్నామని, బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని పేర్కొంది. ఈ ఘటనపై కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్