AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను హైకోర్టు తప్పుబడుతోందనీ, ఏపి హైకోర్టు జగన్ సర్కార్ కు వ్యతిరేకం అంటూ ఇటీవల కాలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ రెండున్నర సంవత్సరాల్లో అనేక విషయాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా కూడా హైకోర్టు తీర్పులు వచ్చాయి. అయితే ఇవి మీడియాలో హైలెట్ కావడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే తీర్పులు మాత్రమే మీడియాలో హైలెట్ అవుతుంటాయి. దీంతో ఏపి న్యాయ వ్యవస్థపై అపవాదులు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ఇటీవల రిటైర్డ్ న్యాయమూర్తి, జై భీమ్ ఫేమ్ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. దీనిపైనా ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా మరో న్యాయమూర్తి స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి చట్టపరిధిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టే అవకాశం ఉండదు. మెరిట్స్ ఆధారంగా హైకోర్టు తీర్పులు, వ్యాఖ్యలు ఉంటాయనేది మరో సారి రుజువు అయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం వక్ప్ ట్రిబ్యునల్ ను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు గత నెల 25వ తేదీన జీవో నెం.16ను జారీ చేసింది. అయితే ఈ జివోను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మహమ్మద్ ఫరూక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమర్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ ధర్మాసనం విచారణ జరిపింది. జీవో నెం.16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేదం లేదని తేల్చి చెప్పింది. ఏ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది.
ప్రభుత్వం నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాధమిక హక్కులకు భంగం కలగవని పేర్కొంది. విశాఖపట్నం, అనంతపురం నుండి హైకోర్టుకు వస్తున్నారనీ, అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ ను ప్రశ్నించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్ కు వచ్చిన నష్టం ఏమిటని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటునకు దారి తీసిన కారణంతో చిన్న అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సమయం ఇస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి మూడవ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది ప్రసాదబాబు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు.
This post was last modified on December 15, 2021 12:17 am
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More
Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More