Chandra Babu Delhi Tour: టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) (PattaBhi) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jagan Mohan Reddy) పై వ్యక్తిగత దూషణల దుమారం నేపథ్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులు చేయడం తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్ష శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తూ వైసీపీపై సవాళ్లు విసిరారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాగా రాష్ట్రంలోని పరిణామాలపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి టీడీపీ సన్నద్దం అయిన సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు గానూ ఆపార్టీ ముఖ్య నేతలు ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకూ ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేల, పలువురు ముఖ్యనేతలు బృందంగా రాష్ట్రపతిని సోమవారం కలవనున్నారు. సోమవారం ప్రత్యేక విమానంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ బృందం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. ఏపి లో ఆర్టికల్ 356 అమలు చేయాలని రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు బృందం తమ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష విరమణ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నిక ఎన్నికల నిబంధనల ప్రకారం జరిగిందా ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని వైసీపీ ప్రకటించుకోవడాన్ని చంద్రబాబు తప్పుబడుతూ వాళ్లు గెలవలేదు…గుద్దుకున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారు. పోలీసులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించడం, రిగ్గింగ్ లకు పాల్పడటం జరిగిందన్నారు. తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వాళ్లను పట్టుకున్నామా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ పాలన ఎంత ఆరాచకంగా ఉందో ప్రజలందరికీ అర్ధం కావాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఎక్కడో అడవిలోనో, మారుమూల ప్రాంతంలోనో జరగలేదనీ, డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో జరిగిందన్నారు.
This post was last modified on October 22, 2021 10:30 pm
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More
మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు… Read More