CM YS Jagan Delhi Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రులతో సమావేశమైయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను సీఎం జగన్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ భేటీలో తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంలో ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సీఎం జగన్ ను ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఏపి చాలా బాగా పని చేస్తొందనీ, ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించడం జరిగిందనీ, ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తొందనీ, ఈ పథకానికి ఏపీ అర్హత పొందినందున నిదులు అందిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు.
కాగా శుక్రవారం (రేపు) ఉదయం విజ్ఞాన్ భవన్ లో జరిగే వామపక్ష తీవ్రవాదం నిర్మూలపై సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం అవ్వనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆమిత్ షాతో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేసి జైల్ కు తరలించిన తర్వాత జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం, కేంద్ర పెద్దలను కలుస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అవినీతికి సంబంధించి సీఐడీ సేకరించిన ఆధారాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అందజేసి సీబీఐ, ఈడీ దర్యాప్తును కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా ముందస్తు ఎన్నికలపై చర్చించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కేసు కోర్టులో ఉందనీ, దాని గురించి జగన్ ఢిల్లీ వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. స్కామ్ లో అడ్డంగా దొరికినందుకే చంద్రబాబు జైల్ కు వెళ్లారన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలనే జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన పని జగన్ కు లేదని స్పష్టం చేశారు. టీడీపీ పొద్దుపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతోందని విమర్శించారు.
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ మరో సారి వాయిదా..
Siddhu Jonnalagadda: టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ ఒకడు. హైదరాబాద్ లో… Read More
Karthika Deepam 2 May 18th 2024 Episode: ఊర్లో కార్తీక్ సైకిల్ బహుమతిగా ఇచ్చాడని శౌర్య చెబుతూ ఉంటుంది.… Read More
Road Accident: పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో వరుడు సహా… Read More
Serial Actor Chandrakanth: టీవీ నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అల్కాపూర్ లోని తన… Read More
Malla Reddy: కుత్భుల్లాపూర్ పెట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుచిత్ర వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కోర్టు… Read More
Prasanna Vadanam: తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో సుహాస్ ఒకరు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్,… Read More
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More