ఏపిలో రాజధాని అంశం రావణ కాష్టంలా కాలుతోంది. ఒక పక్క అమరావతి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసి ఆధ్వర్యంలో రైతులు అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర 15వ తేదీ నాటికి విశాఖ చేరుకుంటుంది. మరో పక్క ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా అడ్డుకోవడానికే రైతుల ముసుగులో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు యాత్ర చేస్తున్నారనీ వైసీపీ నేతలు, మంత్రులు విమర్శిస్తున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన పేరుతో జేఏసి ఆధ్వర్యంలో 15వ తేదీ భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఎందుకీ గర్జన అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. ప్రభుత్వ చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ట్వీట్ లు చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ లపై మంత్రులు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు సంధించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజుకుంటున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ విశాఖలో జనవాణి నిర్వహణకు ప్లాన్ చేసుకున్నారు.
ఈ నెల 15 నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటనకు సిద్దమైయ్యారు. 15, 16,17 తేదీల్లో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలతో సమావేశాలు, 16వ తేదీ విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఓ పక్క మూడు రాజధానులకు అనుకూలంగా విశాఖ గర్జన నిర్వహిస్తున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ విశాఖ టూర్ ప్లాన్ చేసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమిటి..? పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇస్తారా.. ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గర్జన రోజే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన పెట్టుకోవడంపై మంత్రి గుడివాడ అమరనాథ్ ఆయన పై విమర్శలు గుప్పించారు. 15వ తేదీనే విశాఖలో పవన్ కళ్యాణ్ కార్యక్రమం పెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
చంద్రబాబు పేకలో జోకర్ లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడుతున్నారని విమర్శించారు. అనేక సందర్భాల్లో ఈ విషయం రుజువు అయ్యిందన్నారు. ఏదైనా డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ముందుంటారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం పెట్టింది కేవలం డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. జనవాణి కంటే ముందు విశాఖ ప్రాంతంపై ఆయన వాణి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమరనాధ్, విశాఖ కు రాజధాని వస్తుంటే ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. 15వ తేదీన విశాఖ గర్జన జరుగుతున్నప్పుడే పవన్ కళ్యాణ్ కార్యక్రమం పెట్టడం వెనుక ఉద్దేశం అందరికీ తెలుసునని అన్నారు. జనవాణి కార్యక్రమంలో ప్రజలు ఆయన్ను కఛ్చితంగా నిలదీస్తారని తెలిపారు. గాజువాకలో పోటీ చేస్తే ఓడించారని ఈ ప్రాంతంపై కక్ష కట్టారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను మన్నించి పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More
Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More
Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More
Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More
CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More
Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More
Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More
BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More
Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More
Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More
Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More
Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More
The Boys OTT: ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు విన్నింగ్ అండ్ సూపర్ హిట్ డ్రామా సిరీస్ అయిన ది బాయ్స్… Read More
Jagadhatri May 4 2024 Episode 222: నీతో గొడవ పడే టైం ఓపిక రెండు నాకు లేవు సురేష్… Read More
Laapata Ladies OTT First Review: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకురాలిగా… Read More