TDP Janasena Seats Sharing: పొత్తు లెక్క బయటకు..ఎవరిష్టం వాళ్లదే..!

Published by
Srinivas Manem

TDP Janasena Seats Sharing: ఏపి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన – టీడీపీ పొత్తు పొడువడం ఖాయం గానే కనబడుతోంది. ఈ పార్టీల పొత్తుకు సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటకు వస్తుంది. పొత్తులకు సంబంధించి ఆయా పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు సందర్భం వచ్చిన ప్రతి సారి స్పందిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి వ్యూహాల్లో నిమగ్నమైయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రీసెంట్ గా ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సంవత్సరంలో రావచ్చు లేదా రెండేళ్లలో జరగవచ్చు అని సజ్జల అన్నారు. అంటే ముందస్తు ఎన్నికలకు వైసీపీ సిద్దం అన్న సంకేతం ఇచ్చేనట్లు అవుతోంది. 2023 సెప్టెంబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వైసీపీ వెళ్లబోతుంది అన్నట్లుగా ‘న్యూస్ ఆర్బిట్” గతంలోనే కథనం ఇవ్వడం జరిగింది. అందుకే రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాలకు సన్నద్దం అవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడపదడపా పొత్తులపై స్పందిస్తున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందిస్తున్నారు.

TDP Janasena Seats Sharing rumors

 

TDP Janasena Seats Sharing: సీట్ల పంపకాలపై రకరకాల చర్చలు

టీడీపీ – జనసేన పొత్తు అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి (సుమారు నాలుగు నెలలు) సీట్ల పంపకాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ వాళ్లు ఒక రకంగా, జనసేన వాళ్లు మరో తరహాగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జనసేన మాత్రం 60 – 70 సీట్లు అన్నట్లుగా పేర్కొంటున్నాయి. అదే మాదిరిగా జనసేన అనుకూల మీడియాలో జనసేన 60 – 70 సీట్లు గెలుస్తుంది అని రకరకాల సర్వే వార్తలను ఇస్తున్నాయి. ఇటు టీడీపీయేమో జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే ఓడిపోతామేమో, కాస్త లిమిట్ లో సీట్లు ఇవ్వాలి అన్న అంచనాలో ఉంది. వాళ్లు గెలిచే సీట్లే ఇవ్వాలి అన్న ఆలోచనలో టీడీపీ ఉంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే వారు ఓడిపోవడం వల్ల వైసీపీ లాభం చేకూర్చినట్లు అవుతుంది భావిస్తుంది. అదే విధంగా బీజేపీకి సీట్లు ఇస్తే అంతర్గతంగా వైసీపీతో కుమ్మక్కు అయి వైసీపీకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది అన్న భయంలో టీడీపీ ఉంది. ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీలో కొందరు సీనియర్ నేతలు అంగీకరించడం లేదు.

డిజిటల్ మీడియాలో రకరకాల పుకార్లు

పొత్తుల అంశం ఫైనల్ అయిన తరువాత సీట్ల పంపకాల విషయంలో నాలుగైదు విడతల చర్చలు జరగాల్సి ఉంటుంది. పొత్తుల అంశమే ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ప్రాధమిక స్థాయిలోనే ఉంది. ఇప్పటి వరకూ ముడు నాలుగు అడుగులు మాత్రమే పడ్డాయి. ఇంకా పది పదిహేను అడుగులు పాడాల్సి ఉంటుంది. ఇదంతా అయిన తరువాత సీట్ల పంపకాలు. సీట్లు ఎన్ని ఇవ్వాలి అన్నది ఫైనల్ అయి తరువాత ఏయే సీట్లు కేటాయించే అంశంపైనా పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా జరగక ముందే డిజిటల్ మీడియాలో ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంపై వాళ్ల వాళ్ల అంచనాలు వెల్లడిస్తుంటాయి. పార్టీలో అంతర్గత చర్చలు ఇప్పటి వరకూ జరగలేదు. కానీ ఇప్పటికే ఓ ఛానల్ లో జనసేనకు 40 నుండి 45 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లు అంటూ వార్త ఇచ్చేశారు. మరో ఛానల్ లో 60 సీట్లు అని చెప్పారు. టీడీపీ అనుకూల ఛానల్ లో కేవలం 25 సీట్లు అని ఇచ్చారు. సీట్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఆయా పార్టీల మధ్య ఎటువంటి చర్చ జరగలేదు. చర్చలు ప్రారంభం కాకముందే ఇన్ని అన్ని సీట్లు అని ఊహించుకుని వార్తలు ఇవ్వడం అనవసరం. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు.

Srinivas Manem

Recent Posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More

May 11, 2024

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More

May 11, 2024

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024