వేల కోట్లు ఊరకే చేతులు మారవు..!! క్లాజులుంటాయ్, కారణాలుంటాయ్, కోరికలుంటాయ్!! ఏపీలో అటువంటిదే తాజాగా ఓ డీల్ జరిగింది. ఓ పెద్ద పోర్టు అదానీ పరమయ్యింది. పోర్టులో 75 శాతం వాటా అదానీ చేతికి చిక్కింది..! ఇది ఊరికే జరిగే వ్యవహారం కాదు. రాజకీయమూ.., రాజీమార్గమూ.., చీకటి తంత్రమూ ఎన్నో ఈ డీల్ ని నడిపించాయి..!!
నవయుగ అంటే బాగా తెలుసు అందరికీ..! ఆ నవయుగ చేతిలో రాష్ట్రంలో ఎన్నెన్నో ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒక్కోటీ చేతులు మారుతున్నాయి. తాజాగా ఏం జరిగింది అంటే..? నవయుగ చేతిలో ఉన్న కృష్ణపట్నం పోర్టు (నెల్లూరు జిల్లా)లో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ అనే సంస్థకి వెళ్ళింది. సింపుల్ గా ఆదానీకి వెళ్ళింది. దీని విలువ రూ. 13 , 572 కోట్లు. ఇన్నాళ్లు నవయుగ పూర్తిస్థాయిలో వాటాదారుగా ఉండగా, తాజాగా 75 శాతం తీసుకుని పూర్తి అజమాయిషీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు మరో కీలక విషయం చూసుకోవాలి. నవయుగ అంటే పెద్ద కంపెనీ. అంతర్జాతీయ చరిత్ర ఉంది. ఇంజనీరింగ్ పనులు, ప్రాజెక్టులు, స్టీల్, ఎక్స్పోర్ట్, ఐటీ, పవర్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా విభాగాల్లో నవయుగ ముద్ర ఉంది. కృష్ణపట్నం పోర్టుతో వారి సామ్రాజ్యం మరింత విస్తరించింది. ఈ కంపెనీనే చంద్రబాబు హయాంలో అనేక ప్రాజెక్టులు దక్కించుకుంది. పట్టిసీమను తీసుకుని గాయిత్రి వంటి చిన్న కంపెనీలకు సబ్ ఇచ్చేసింది. పోలవరం పనులను చేపట్టి చాలా కాలం చేసింది. చంద్రబాబు హయాంలో గిన్నిస్ రికార్డులనీ.., బొమ్మలు, ఫొటోలతో బాగా హడావిడి చేసింది. బందరు పోర్టు దక్కించుకుంది. ఇంకా ఉంటే రామాయపట్నం కూడా కొట్టేసేదే.
జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఆ కంపెనీకి చెందినవని రద్దు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుని మేఘా దక్కించుకుంది. బందరు పోర్టు రద్దయింది. తాజాగా కీలకమైన కృష్ణపట్నం పోర్టులో వాటా వెళ్ళిపోయింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే… నవయుగ ఏమి రాజకీయంగా జగన్ తో విభేదించలేదు. వైఎస్ ఉన్నప్పటి నుండి ఈ కుటుంబాల మధ్య ఓ అవగాహన ఉంది. అయితే జగన్ కి ఉన్న వేరే ప్రాధాన్యాలు, దృష్ట్యా ఈ మార్పులు చేర్పులు తప్పవు.
ఒకే. వాటా వెళ్ళింది. నవయుగ అలా తప్పుకుంది. కానీ అదానికే ఎందుకు ఇచ్చినట్టు..?? ఇతర చాలా కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయిగా.., అంబానీ, మేఘా లాంటి వాళ్ళు ఉన్నారుగా అనే అనుమానాలు రావచ్చు. ఈ విషయం చెప్పుకుందాం..!! అంబానీకి, ఆదానీకి చాలా తేడా ఉంది. అంబానీ అందరి మనిషి. సోనియా, మోడీ, చంద్రబాబు, జగన్ ఇలా అందరితోనూ తాను బాగానే ఉంటారు. ఎవరితోనూ గిల్లి కజ్జాలు పెట్టుకోడు. తన అవసరాలు, ప్రాధాన్యాలు తనకు ఉంటాయి. కానీ అదానీ అలా కాదు. అతనికి ఆమూలాగ్రం మోదీనే. మోడీ వచ్చిన తర్వాత అదానీ గ్రూపు బలం పదుల రెట్లు పెరుగుతుంది. ఇక మోడీ – జగన్ ల బంధం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. అందుకే బీజేపీ – వైసీపీ మధ్యలో అదానీ అన్నమాట. కేంద్రంలో కార్పొరేట్ దిగ్గజాలుగా ఉన్న అంబానీ, ఆదానీలతో జగన్ ఇలా వియ్యం కుదుర్చుకున్నట్టు. నత్వానికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా అంబానీతో.., ఈ పోర్టు వాటా ద్వారా ఆదానీతోనూ వియ్యం కలిసినట్టే. ఇక కార్పొరేట్ ని రాష్ట్రంలో ఆపతరమా …? జగన్ – బీజేపీ బంధాన్ని శంకించతరమా..??!
AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More
Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More
Aa Okkati Adakku: ఈ మధ్య సీరియస్ కాన్సెప్ట్ కథలతో ప్రయోగం చేసిన అల్లరి నరేష్.. తాజాగా ఆ ఒక్కటి… Read More
Indraja: జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ఎన్నో కార్యక్రమాలకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ గురించి… Read More
Manasu Mamatha: ఆకట్టుకునే అందలతో పాటు సరైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మైమరిపించే ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలో కొంతమంది మాత్రమే ఉంటారు.… Read More
Krishna Mukunda Murari: ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కన్నా బుల్లి తెర నటీనటులు తమ గ్లామర్… Read More
Faima: ప్రస్తుత కాలంలో మొదట ప్రేమించుకోవడం అనంతరం విడిపోవడం చాలా కామన్ గా మారిపోయాయి. పూర్వకాలంలో వీటిని సినీ సెలబ్రిటీలే… Read More
Mamitha Baiju: మమితా బైజు.. ఈ యంగ్ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల విడుదలైన మలయాళ లవ్ డ్రామా… Read More
Pooja Hegde: గత ఏడాదిన్నర కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను బ్యాడ్ టైం ఓ రేంజ్ లో… Read More
Rana Daggubati: రానా దగ్గుబాటి.. సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా అత్యంత సుప్రసిద్ధుడు. ప్రముఖ నిర్మాత… Read More
Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు పారేసుకుంటుంది.… Read More
Land Titiling Act: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర… Read More
Supritha: సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో… Read More
ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి… Read More