Tv Debates ఇప్పుడు మీడియాలో ఇవి చాలా ముఖ్యం. ప్రజాభిప్రాయాలను తమ భుజాలపై మోస్తున్నామనే భావనలో జరిగే మాసివ్ చర్చలు ఇవి. రాజకీయ నాయకులు, కాలమిస్టులు, సంఘ సంస్కర్తలు, పార్ట నాయకులు, మేధావులు.. ఇలా సమాజంలోని అనేక వర్గాల వారు టీవీ చర్చల్లో పాల్గొంటారు. ఇప్పుడు డిబేట్స్ అలా లేవు. నిన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో జరిగిన డిబేట్ ఇందుకు ఉదాహరణగా నిలిచింది. రాష్ట్ర బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని అమరావతి జేఏసీ నాయకుడు శ్రీనివాస్ చెప్పుతో కొట్టారు.. అదీ లైవ్ లో. ఈ ఘటన సంచలనం రేపింది. అసలు ఈ డిబేట్స్ ఎవరి కోసం? ఎందుకోసం? జరుగుతున్నాయో కూడా డిబేట్ నిర్వహిస్తున్న వెంకటకృష్ణ కూడా చెప్పలేరేమో. భావోద్వేగాలను కంట్రోల్ చేయలేనప్పుడు డిబేట్స్ ఎవరి కోసం. వీరి డిబేట్స్ వల్ల ప్రభుత్వ నిర్ణయాలు మారతాయా? వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయా? అంటే క్వశ్చన్ మార్కే..!
పల్లెటూళ్లలో ఒకప్పుడు రచ్చబండ జరిగేది. ఊరి పెద్దలంతా ఉదయమో, సాయంత్రమో ఒకచోట చేరి గ్రామ సమస్యలపైనో.. రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే విషయాలపైనో తెలిసినంతలో మాట్లాడుకునేవారు. తగిన రీతిలో ఎలా గ్రామాభివృద్ధి జరగాలి.. ఇందుకు ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించాలి, రోడ్లు, స్కూళ్లు, గ్రంధాలయాలు, కమ్యూనిటీ హాల్స్, పంచాయతీ నిధులు ఖర్చు.. ఇలా అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చేవి. ఇవన్నీ మనం పాత సినిమాల్లోనో.. పెద్దవాళ్లో చెప్తేనో తెలిసాయి. చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికేవి. కాలం మారింది. రేడియో, దూరదర్శన్ వచ్చాయి. ఆరోజుల్లో చర్చాగోష్టి కార్యక్రమాల్లో పలు విషయాలు, సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరిగేవి.. ప్రజలను ఆలోచింపజేసేవి. భావోద్వేగాలు, సొంత అభిప్రాయాలు, కామెంట్స్, లైక్స్, లైవ్.. లాంటి ప్రస్తుత మీడియా విపరీత పోకడలు ఉండేవి కావు. ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగింది. తమ చానెల్ హైలైట్ అవ్వాలి.. నాయకులు తమకు తాము ఫోకస్ కావాలి.. తాము ప్రజల కోసమే ఉన్నామనే భ్రమలు పార్టీలు ప్రజలకు కల్పించాలి. మొత్తంగా.. ఎవరికి వారు హైలైట్ కావాలి.
ఈ అత్యత్సాహమే నేటి టీవీ డిబేట్లలో భావోద్వేగాలు రగిలేలా చేస్తున్నాయి. నిన్నటి డిబేట్ లో అమరావతి అంశం చర్చకు వచ్చింది. ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు 3వేల కోట్లు బ్యాంకు రుణాలకు ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు నిర్ణయించింది. దీనిపై డిబేట్ కు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని, అమరావతి జేఏసీ నేత శ్రీనివాస్ ను చానెల్ హోస్ట్ వెంకటకృష్ణ ఆహ్వానించారు. అయితే.. టాపిక్ లో జగన్ మంచి పని చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం తప్పైపోయింది. బ్యాంకు రుణాలు తెచ్చాం అని గొప్పలు చెప్పుకునే సీఎంలు గతంలో కూడా ఉన్నారు.. అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. దీంతో శ్రీనివాస్ కోపోద్రిక్తుడై విష్ణువర్ధన్ రెడ్డికి తన చెప్పు చూపించడమే కాదు ఆయన మొహాన విసిరిగొట్టారు. వెంటనే వెంకటకృష్ణ.. లైవ్ ప్రోగ్రామ్ ను నిలిపేశారు. పోయిన బీజేపీ నేత పరువును కాపాడేదెవరు.. చెప్పు విసిరిన శ్రీనివాస్ కు తప్పు అని ఇప్పుడు తెలిసినా ఉపయోగం లేదు. ఈ సంఘటనకు సమాధానం చెప్పేది ఎవరు.. సదరు చానెలా.. హోస్టా..?
ఆమధ్య వైసీపీ నేత శ్రీధర్.. ఓ మహిళను ‘విజయవాడ వచ్చి తంతాను’ అన్నారు. గతంలో మరో తెలుగు చానెల్ లైవ్ డిబేట్ లో నేతలు బూతులు తిట్టుకుంటూ కొట్టుకోబోయారు. సమస్యల పరిష్కారం కోసం.. వ్యవస్థల్లో మార్పు కోసం పెరిగిన టెక్నాలీజీ ఉపయోగపడట్లేదు. ప్రజలకే అసహ్యం అనిపించేలా ఉండే ఈ డిబేట్స్ ఎవరికి ఉపయోగం? జాతీయ చానెల్స్ లో ఒకేసారి పది మందితో ఆన్ లైన్లో డిబేట్స్ పెట్టిస్తారు. ఒకరు మేకప్ వేసుకుంటూంటారు.. మరొకరు తింటూంటారు. ఇటివలే ఓ ఆన్ లైన్ డిబేట్ లో పాల్గొన్న ఓ వ్యక్తికి ఆయన భార్య ముద్దు పెట్టబోయిన సంఘటన విపరీతంగా వైరల్ అయింది. ఇటువంటి సంఘటనల మధ్య ప్రజలకు టీవీ చానెల్స్ డిబేట్స్ ఏం చెప్తున్నట్టు. హీరోల అభిమానులతో డిబేట్స్ పెడుతారు. మా హీరో ఇలా.. మా హీరో అలా అనుకుంటారు. వారు కొట్టుకుంటారేమో అనే ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చేస్తుంది. ఇకపైనైనా డిబేట్స్ లో చానెల్స్ భావోద్వేగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టకపోతే మరిన్ని ఘటనలు జరగడం ఖాయం..!!
Client Associates Announces First Close of its Maiden Fund at ~INR 300 Crores with Strong… Read More
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More