Bharat Ratna: భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అలానే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, హరిత విప్లవ నిపుణుడు ఎంఎస్ స్వామినాథన్ కు సైతం భారతరత్న ప్రకటించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.కాగా, ఇటీవలే ..ఎల్ కే అద్వానీ, కర్పూరీ ఠాకూర్ కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. మన మాజీ ప్రధాని పీవీ నరసింహరావు గారిని భారతరత్న తో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు ప్రధాని మోడీ. విశిష్ట పండితుడుగా, రాజనీతిజ్ఞుడిగా భారతదేశానికి పీవీ వివిధ హోదాల్లో సేవలు అందించారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడుగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలకపాత్ర పోషించిందన్నారు. దేశాభివృద్ధికి బలమైన పునాది వేశారన్నారు.
పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన పీవీ నరసింహరావు మంథని నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. 1957 లో తొలి సారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72 లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన తర్వాత మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు.
1971లో జరిగిన పరిణామాల నేపథ్యంలో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు స్వస్తిపలికారు. 1977లో హనుమకొండ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరో సారి ఇదే నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎంపీగా ఎన్నికైయ్యారు. కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1991 లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధాన మంత్రి పదవి వరించింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బహుభాషా కోవిదుడుగా గుర్తింపు పొందారు. పీవీ నర్శింహరావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More