ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద టెస్టే పెట్టారని అంటున్నారు పార్టీ నాయకులు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కండీషన్లతో పరిటాల ఫ్యామిలీలో చిన్నపాటి పొలిటికల్ వార్ కూడా మొదలైంది. ఈ కుటుంబం వచ్చే ఎన్నికల్లో రెండు టికెట్లు ఆశిస్తోంది. రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ను కూడా తమకే ఇవ్వాలని కోరుతున్నారు. కానీ, చంద్రబాబు రాప్తాడును ఇప్పటికే ఖరారు చేశారు. పైగా.. ఈ టికెట్ నుంచి.. మాజీ మంత్రిపరిటాల సునీత పోటీ చేయాలని ఆయన నిర్దేశించారు. మరి నా కుమారుడు పరిస్థితి ఏంటి? అని ఆమె పంచాయతీ పెట్టారు.
ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట చంద్రబాబు దగ్గర ఆమె.. తన కుమారుడిని తీసుకువచ్చి మరీ ప్రశ్నించారు. ధర్మవరంలో గత మూడు సంవత్సరాలుగా బాబు(శ్రీరాం) తిరుగుతున్నారని.. కొన్నాళ్లు పాదయాత్ర కూడా చేశారని.. పార్టీని బలోపేతం చేశాడని.. సునీత కన్నీటి పర్యంతమైనట్టు పార్టీ నాయకులు తెలిపారు. అయితే..చంద్రబాబు మాత్రం తనకు టికెట్ ఇవ్వకూడదన్న ఉద్దేశం లేదని.. కానీ, ప్రత్యర్థి పక్షం బలంగా ఉందని.. అంత బలాన్ని తట్టుకుంటారో లేదో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు.
`ఆర్థికంగా మీరు తట్టు కోగలరా? ` అని చంద్రబాబు సునీతను ప్రశ్నించారు. రెండు స్థానాల్లోనూ వైసీపీ బలంగా ఉంటే.. మీరు ఆర్థికంగా రెండు నియోజకవర్గాల్లోనూ తట్టుకుని నిలబడగలరా? అని చంద్రబాబు ప్రశ్నించారని తెలిసింది. అంతేకాదు.. ఆర్థిక అంశాలపై మీ కుటుంబం కూర్చుని చర్చించుకుని నాకు సమాచారం ఇవ్వాలని.. అప్పటి వరకు ధర్మవరంపై నిర్ణయం తీసుకోనని కూడా..చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. విచిత్రం ఏంటంటే ధర్మవరంలో గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పార్టీ మారి బీజేపీలోకి వెళ్లాకే శ్రీరామ్కు ఇక్కడ పార్టీ పగ్గాలు ఇచ్చారు. శ్రీరామ్, సునీత ఈ సారి ఇద్దరూ అసెంబ్లీకే పోటీ చేయాలన్న కోణంలో బాగా కష్టపడ్డారు.
అయితే ఇప్పుడు చంద్రబాబుకు ఈ కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం ఇష్టంలేదు. దీంతో ఇప్పుడు .. రెండు సీట్ల వ్యవహారం.. సునీత కోర్టులోకి చంద్రబాబు నెట్టేశారు. దీనిపైనే ఆమె తర్జన భర్జన పడుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నామని చెబుతున్నా చంద్రబాబు వినే పరిస్థితి లేదు. రాఫ్తాడులో సునీతను పోటీ చేయమని బాబు చెపుతున్నారు. అలా అయితే శ్రీరామ్ను పక్కన పెట్టాయాలి. ఈ నేపథ్యంలో సునీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఇరు నియోజకవర్గాల అనుచరులతో, తమకు అనుకూలంగా ఉన్న వ్యాపార వేత్తలతో శుక్రవారం(ఈరోజు) ఆమె భేటీ నిర్వహిస్తున్నారు. మరి చివరకు ఏం తేలుస్తారో చూడాలి.
Millennials dominate 60% of Investor Base into Fractional Investments 60% of all investments made are… Read More
Vijay Deverakonda: జయపజయాలతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ హీరోగా దూసుకుపోతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ… Read More
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More