PM Modi: ప్రపంచ స్థాయిలో మన దేశం గురించి ఇప్పటి వరకూ ఇండియాగా సంభోదిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అధికారిక సమాచారం పంచుకోవాల్సిన సమయంలో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’, ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే సంబోధించే వారు. ఇది మనందరికీ తెలుసు. ఇది సంప్రదాయంగా వస్తొంది కూడా. అయితే ఇటీవల కాలంలో అన్నింటికీ భారతీయత జోడిస్తూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కార్.. ఇండియా పేరును భారత్ గా మార్పు చేయాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు ఇచ్చిన మోడీ సర్కార్ .. ఈ నెల 18 నుండి జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తొంది.
ఢిల్లీ వేదికగా ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు జీ – 20 శిఖరాగ్ర సమావేశాలు జరగనుండగా, ఈ నెల 9వ తేదీన విదేశీ అతిధులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విందు ఏర్పాటు చేసారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం విందు ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా పేర్కొన్నారు. ఇలా ఇండియా పేరును మార్చడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు ప్రధాని మోడీ సారధ్యంలోని ఎన్డీఏ సర్కార్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అధికారిక కార్యక్రమాల్లో ఇండియా పేరు భారత్ గా మార్చడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు అంటున్నాయి.
దీనిపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ .. “ఇప్పుడు రాజ్యాంగంలోని 1వ అధికరణ ‘భారత్, దట్ ఈజ్ ఇండియా’, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ కూడా దాడికి గురవుతున్నాయి” అని పోస్టు చేశారు జైరాం రమేష్. ఈ పోస్టుకు స్పందించిన ఆర్జేడీ ఎంపీ మానోజ్ ఝా .. తాము తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టి కొన్ని వారాలైందని అన్నారు. అప్పటి నుండి బీజేపీ రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని ఆహ్వానాలు పంపడం ప్రారంభించిందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం.. ఇండియా అంటే భారత్ అని ఉంటుందని.. వారు (బీజేపీ) తమ నుండి ఇండియాను, భారత్ ను వేరు చేయలేరని అన్నారు.
ఆంగ్లంలో ఇండియా అని, హిందీలో భారత్ అని పిలవడం ఎప్పటి నుంచో కొనసాగుతుండగా, ఆగమేఘాల మీద ఇండియాను భారత్ గా పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. విపక్షాల కూమిటికి భయపడే దేశం పేరును మార్చేందుకు బీజేపీ యత్నిస్తొందని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. తమ కూటమి పేరు ను బారత్ గా మార్చుకుంటే .. దేశం పేరును మళ్లీ మారుస్తారా అంటూ ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. భారత్ అని రాయడంలో, చెప్పడంలో ఇబ్బంది ఏమిటని బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కారణం లేకుండా అపర్ధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తొందని అన్నారు.
మన దేశం భారత్ అని, అందులో ఎలాంటి సందేహం లేదని, కాంగ్రెస్ ప్రతిదానికీ సమస్యేనని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అయితే ఈ పేరు మార్పు అంశంపై దేశ వ్యాప్తంగా భిన్న వాదనలు వినబడుతున్నాయి. ఇండియా కూటమి పక్షాలు దీనిపై విమర్శలు చేస్తుండగా, మరి కొన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. కొద్ది వారాల క్రితం 26 విపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇన్ క్లూజివ్ అలయెన్స్’ (INDIA) ఇండియా గా పేరు పెట్టుకున్నాయి. దీనిపై ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ తిరస్కరణ సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ తరుణంలో మోడీ సర్కార్ .. ఆఘమేఖాల మీద ఇండియాకు పేరు మార్చడంపై.. వామ్మో మోడీ మామూలోడు కాదు ! ఇండియా ని భారత్ గా మార్చడం వెనక పెద్ద ప్లానింగ్ యే ఉందంటూ నెటిజన్ లు కామెంట్స్ చేస్తున్నారు.
YSRCP Visakha: వైసీపీలో తోపులు అందరూ వైవీ సుబ్బారెడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ? మ్యాటర్ ఇదే !
This post was last modified on September 6, 2023 9:57 pm
Tollywood: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మే 9వ తేదీ అత్యంత ప్రత్యేకమైన రోజు. మే 9న సినిమాను విడుదల చేస్తే… Read More
Sai Pallavi: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి.… Read More
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More