YSRCP: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలకు భారీగా షాక్ లు ఇచ్చారు ఆ పార్టీల నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో ఆశావహులకు టికెట్ లు దక్కలేదు. దీంతో ఆయా పార్టీల్లో అసంతృప్తి నేతలు వలస బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు.
రాజంపేట మాజీ టీడీపీ ఇన్ చార్జి గంటా నరహరి మంగళవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చాలా కాలంగా టీడీపీ రాజంపేట ఇన్ చార్జిగా ఉన్న గంటా నరహరి ఈ నెల 13వ తేదీన జనసేన పార్టీలో చేరారు. అయితే రాజంపేట లోక్ సభ స్థానాన్ని టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని అభ్యర్ధిగా ఆ పార్టీ కేటాయించింది. అటు టీడీపీలో ఆ తర్వాత జనసేనలోనూ ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో జనసేన పార్టీకీ గుడ్ బై చెప్పారు గంటా నరహరి. ఇవేళ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరగా, ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిధున్ రెడ్డి, ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.
అలానే నూజివీడు మాజీ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత చిన్నం రామకోటయ్య కూడా వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పోరేటర్లు, జనసేన నాయకులు వైసీపీలో చేరారు. మాజీ కార్పోరేటర్ లు గండూరి మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ కోనూరు సుబ్రమణ్యం (మణి), మాజీ డివిజన్ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకుడు బత్తిన రాము తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, వైసీపీ అభ్యర్ధి కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ లు పాల్గొన్నారు.
అలానే విశాఖకు చెందిన సీనియర్ నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జీవి రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, జనసేన నాయకురాలు బొడ్డేటి అనురాధ లు జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమరనాథ్, విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కేకే రాజు పాల్గొన్నారు. అదే విధంగా సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కూడా వైసీపీలో చేరారు. సూళ్లూరుపేటకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరికి చెందిన మస్తాన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ అంగలూరి లక్ష్మీశివకుమారి, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు వైసీపీలో చేరారు.
Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ
Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ అనగానే గుర్తుకు వచ్చే పేరు కాజల్ అగర్వాల్. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్… Read More
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More