YSRCP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘సిద్దం’ పేరుతో పార్టీ క్యాడర్ తో వైసీపీ నేటి నుండి సమావేశాలు నిర్వహిస్తొంది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తొంది. ఈ సమావేశానికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ హజరై 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఏర్పాటు చేసిన భారీ ప్రాంగణంలో తొలి సభ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న సీఎం జగన్ ..అక్కడి నుండి హెలికాఫ్టర్ లో భీమిలి సంగీవలసలో జరిగే బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. ఈ సభలో రాబోయే ఎన్నికలపై క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారిగా భారీ ఎత్తున క్యాడర్ తో సమావేశం నిర్వహిస్తుండటంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ధీటుగా ఎలా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించడం, పార్టీ మరింత బలోపేతం చేయడం కోసం క్యాడర్ ఏ విధంగా కృషి చేయాలని తదితర అంశాలపై జగన్ పలు సూచనలు చేయనున్నారు.
అలానే పార్టీ క్యాడర్ తో మమేకమై తానున్నానంటూ వారికి భరోసా ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్ర తర్వాత రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాల్లో క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంతో పాటు విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించే దిశగా క్యాడర్ ను సిద్దం చేయనున్నారు. ఇదే క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మార్చాల్సి వస్తుందో కూడా జగన్ క్యాడర్ కు వివరించి, పార్టీ అభ్యర్ధి విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించనున్నారు.
గెలుపే లక్ష్యంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను మార్చి కొత్త వారికి ఇన్ చార్జి గా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు జరగనున్నాయి. నియోజకవర్గంలో అభ్యర్ధి ఎవరైనా పార్టీని దృష్టిలో పెట్టుకుని క్యాడర్ పని చేయాలని సీఎం జగన్ సూచించనున్నారు. ఈ ఎన్నికల శంఖారావం పూరిస్తున్న ఈ సభలోనే కీలక హామీలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలతో పాటు మరల అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కొత్త పథకాలను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Kovvuru TDP: కొవ్వూరు టీడీపీలో చిచ్చురేపిన ఫ్లెక్సీల వ్యవహారం
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More