YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ తొలి సారిగా హైదరాబాద్ నోవా టెల్ హోటల్ నందు సంస్మరణ సభ (ఆత్మీయ సమ్మేళనం) ఏర్పాటు చేయడంతో ఇందులో రాజకీయ కోణం దాగి ఉందని చాలా మంది ముందే ఊహించారు. వైెఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఉన్నందున ఈ పార్టీ బలోపేతం చేసేందుకే ఈ సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు స్పష్టం అయ్యింది. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు వివిధ రాజకీయ పార్టీల్లోని వైఎస్ఆర్ సహచరులను,
ఆయన మంత్రివర్గంలో పని చేసిన వారిని విజయమ్మ ఆహ్వానించినప్పటికీ ఈ సమావేశ ఏజండాను అత్యధికులు గ్రహించారు. అందుకే వారు వైఎస్ఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ ఆత్మీయ సమ్మేళనం (సంస్మరణ సభ)కు డుమ్మా కొట్టారు. ఈ నాయకులు ఊహించినట్లే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రసంగాలు జరిగాయి. వైఎస్ఆర్ అభిమానులు ఏపిలో జగన్మోహనరెడ్డి సీఎం అయ్యేందుకు తోడ్పాటు అందించారనీ, అదే విధంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకున్న రాజన్న బిడ్డ షర్మిలకు అండగా వైెఎస్ అభిమానులు, సహచరులు నిలవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
వైఎస్ షర్మిల కూడా తను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తూ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానంటూ సంస్మరణ సభలో రాజకీయ ప్రసంగం చేశారు. అటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇద్దరూ వైెఎస్ గురించి మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైయారు. ఈ సంస్మరణ సభ ఉద్దేశాన్ని ముందే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ.. పార్టీకి చెందిన వారు ఎవరూ హజరు కావద్దంటూ ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరై వైఎస్ఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను ముందే వదిన విజయమ్మకు హజరు అవుతానని మాట ఇచ్చాననీ ఆమెకు ఇచ్చిన మాట కోసం వైఎస్ఆర్ సంస్మరణ సభకు హజరైనట్లు చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి హజరు అవుతారని ఆ పార్టీ నేతలు ముందుగానే ఊహించారు.
ఇక పోతే వైెఎస్ మంత్రివర్గంలో పని చేసిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎక్కువ మంది తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలలో, ఏపిలో వైఎస్ఆర్ సీపీలో కన్ఫర్ట్ గా ఉన్నారు. విజయమ్మ ఆహ్వానాన్ని మన్నించి గానీ, వైెఎస్ పై ఉన్న అభిమానంతో గానీ ఈ సమావేశానికి హజరై ఉంటే షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీలో చేరే అవకాశం ఉందటూ మీడియాలో వార్తలు వస్తాయి. దీంతో ఆయా పార్టీలో వారికి ప్రాధాన్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాదాపుగా అందరూ సీనియర్ నాయకులే కదా అందుకే ఈ పరిణామాలు ఊహించే వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని మనసులోనే ఉంచుకుని మిన్నకుండిపోయారు. కేవిపి రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి, జితేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితర నేతలతో పాటు వైఎస్ హయాంలో పని చేసిన పలువురు అధికారులు మాత్రం ఆత్మీయ సమ్మేళనంకు హజరైయ్యారు.
1.Toll Issue: టోల్ ఫీజు విషయంలో మాజీ కలెక్టర్ గొడవ..!
3.friendship: దొంగలతో స్నేహం వారిని ఆలా మార్చేస్తుందేమో..!!
This post was last modified on September 4, 2021 12:26 pm
Brahmamudi:అప్పు రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి వెళ్లి కావ్య కిడ్నాప్ అయిన విషయం చెప్పాలంటే ఇంట్లో అసలే… Read More
Nuvvu Nenu prema: విక్కీ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకదు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగిన విక్కీ నీ… Read More
Krishna Mukunda Murari: భవాని దేవికి ముకుంద మీద అనుమానం వస్తుంది. తను వాంతులు చేసుకుంటే, ఆదర్శవచ్చి తనతో మాట్లాడిన… Read More
ఏపీలో ఎన్నికల పర్వం ముగిసింది. సోమవారం జరిగిన పోలింగ్లో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికీ అంతుచిక్కని విషయం.… Read More
రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగిన హింస రాష్ట్రా న్నే కాదు.. దేశాన్ని కూడా… Read More
టీడీపీలో ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర విషయం.. ఆపార్టీ పగ్గాలను నారా లోకేష్ ఎప్పుడు చేపడతార నే. చంద్రబాబు తర్వాత.. పార్టీకి… Read More
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శినియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? ఇదీ.. ఇప్పుడు పెద్ద చర్చగానే కాకుండా.. భారీ ఎత్తున బెట్టింగులు కూడా… Read More
May 18: Daily Horoscope in Telugu మే 18 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని జిందాల్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేయడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఎలాంటి నోటీసులు లేకుండా… Read More
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు… Read More
Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత… Read More
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు… Read More
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More