అమరావతి:కాపులను మోసం చేయడం వల్లనే మిమ్మల్ని ఆ పక్కన కూర్చొబెట్టారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడిగిన ప్రశ్నపై సిఎం జగన్ వివరణ ఇచ్చారు. తమ ఎన్నిక ఫ్రణాళిక చదివి వినుపిస్తూ, చేయగలిగిందే చెబుతామని జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్లో కాపులకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బడ్జెట్పై చర్చ సందర్భంగా మంగళవారం కాపు రిజర్వేషన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం ఆర్ధికంగా వెనుబడిన కులాలకు ప్రకటించిన పది శాతం రిజర్వేషన్లో కాపులకు సామాజిక న్యాయం చేయడం కోసం ఐదు శాతం కేటాయించాం. దానిపై ఈ ప్రభుత్వ విధానం ఏమిటి, దాన్ని అమలు చేస్తారా లేదా చంద్రబాబు ప్రశ్నించారు.
దీనిపై వైసిపి సభ్యుడు ధర్మశ్రీ మాట్లాడుతూ మాటలు చెప్పడమే గానీ ఒక్కరికైనా కాపులకు బిసిలుగా సర్టిఫికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాపులలో ఒక్కరికైనా బిసి సర్టిఫికెట్ ఇచ్చినట్లు చూపితే దానికి కమిట్ అవుతామని ధర్మశ్రీ అన్నారు. వైసిపి సభ్యులు అంబటి రాంబాబు, కొలుసు పార్థసారధిలు సైతం చంద్రబాబు కాపులను మోసం చేశారంటూ విమర్శించారు.
దీనిపై సిఎం జగన్ మాట్లాడుతూ బడ్జెట్పై చర్చ జరుగుతోందా లేదా మరొకటి జరుగుతుందా అని ప్రశ్నించారు. కాపులను మోసం చేసి ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని జగన్ దుయ్యబట్టారు. మీరు కాపులను మోసం చేశారన్నదానికి ఉభయ గోదావరి జిల్లాలో మీకు వచ్చిన సీట్లే నిదర్శనం అని జగన్ అన్నారు. కాపులకు ఏమి చేయబోతున్నామో ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టామని జగన్ పేర్కొన్నారు. కేంద్రం ఇబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లో కాపులకు గానీ మరొకరికి గానీ వాటా ఇవ్వడం ఏలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీనికి చట్టబద్ధత ఉండదనీ, అందుకే దీనిపై కోర్టులో కేసు దాఖలయిందనీ జగన్ పేర్కొన్నారు.
This post was last modified on July 16, 2019 3:31 pm
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More