రాజమండ్రి: పోలవరం ప్రాజెెక్టు పునరావాస కార్యక్రమాలను వేగవంతంగా, లోపరహితంగా అమలు చేసేందుకు, సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తక్షణమే ఆ అధికారి బాధ్యతలు తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేస్తారని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి రాజమండ్రి విమానాశ్రయంలోని ఏటిసి టవర్ భవనంలో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ధవళేశ్వరంకు ఎగువన ఉన్న దేవీపట్నం సహా ఇతర ప్రాంతాల్లో వరద పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో 10 నుండి 11 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా పెద్దగా ముంపు ఉండేది కాదనీ, కాని ఈసారి ముంపు ఎక్కువగా ఉందని అధికారులు, ఎమ్మెల్యేలు వివరించారు. కాఫర్డ్యాం కారణంగా ముంపు పెరిగిందని ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా తగిన ప్రణాళిక వేసుకోవాలని అధికారులను సిఎం ఆదేశించారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా పోలవరం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని పరిగణలోకి తీసుకుని, దానికి అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాని సిఎం సూచించారు. వచ్చే వరద, ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు పోలవరం పునరావాస పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. త్వరగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులకు సిఎం సూచించారు.
ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఇప్పుడిస్తున్న సహాయం కాకుండా అదనంగా అయిదు వేల రూపాయల చొప్పున సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీయే కాకుండా అదనంగా అయిదు వేల ఆర్థిక సహాయం అందించాలని సిఎం సూచించారు. ఇళ్లు నష్టపోయినా, పంట నష్టపోయినా వీటికి నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా అయిదు వేల ఆర్థిక సహాయం ఇవ్వాలని సిఎం చెప్పారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో దాదాపు 70శాతానికి పైగా గిరిజన గ్రామాలున్నాయని పేర్కొంటూ వరదల కారణంగా వారి జీవనోపాథి దెబ్బతిన్నంందున ప్రత్యేకంగా అయిదు వేల రూపాయలు సహాయం అందించాలని నిర్ణయించినట్లు సిఎం తెలిపారు.
ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సిఎం ఆదేశించారు.
పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారంతో పాటు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన పంటలు కూడా వరదల కారణంగా దెబ్బతింటే, అక్కడ వారికీ పరిహారంతో పాటు ఉచితంగా విత్తనాల సబ్సిడీ అందించాలని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటి సిఎంలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, అనిల్కుమార్ యాదవ్, రంగనాథరాజు, ఎంపి మార్గాని భరత్, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, ధనలక్ష్మి, బాలరాజు, కారుమూరి నాగేశ్వర్రావు, కొట్టు సత్యన్నారాయణలు పాల్గొన్నారు.
This post was last modified on August 8, 2019 4:34 pm
Indian Student Missing: అమెరికాలో భారతీయ, భారత సంతతి విద్యార్ధులు వరసగా ప్రమాదాలకు గురవ్వడం కలకలం రేపుతోంది. తాజాగా ఓ… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మొత్తం పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అందరి ఫోకస్ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది. పిఠాపురం నియోజకవర్గం లో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తానే ఉంటానని జగన్మోహన్ రెడ్డి మరోసారి కుండ బద్దలు కొట్టి చెప్పారు. మరోసారి గెలుస్తానని… Read More
BrahmaMudi: రాజ్ తనకి రేపటితో ఇంటి నుంచి వెళ్లిపోవాలని తెలియడంతో బాధగా ఉంటాడు. కావ్య కి బాబుని ఇచ్చేసి తను,… Read More
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More