అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులుగా కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాలుగా విడగొట్టే ఆలోచన చేస్తే మంచిదని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేస్తున్న మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో మైసూరా ఈ విధంగా వ్యాఖ్యానించారు. పరిపాలనా వికేంద్రీకరణ విషయంలో జగన్మోహనరెడ్డి ప్రతిపాదన కొంత వరకు ఆమోదయోగ్యమైనప్పటికీ ఏ ప్రాంతం వారు బాధపడకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలుగా విడిపోతే మంచిదన్నారు. ఇది కష్టసాధ్యమైన విషయమేమి కాదన్నారు. ఏలాగూ కేంద్రంలోని బిజెపి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమే కాబట్టి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఆ తరువాత బాధ్యత కేంద్రంపై ఉంటుందన్నారు. మూడు ప్రాంతాలుగా విడిపోతే ఎవరి రాజధాని వారికే ఉంటుందన్నారు.
అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్లో సెక్రటేరియట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో మూడు రాజధానులుగా అభివృద్ధి చేయచేయాలని సిఎం జగన్ ఆలోచన అయి ఉండవచ్చని అన్నారు.రాజధానికి భూమిలిచ్చాం కాబట్టి క్యాపిటల్, సచివాలయం, ఇతర కార్యాలయాలు, సంస్థలన్నీ తమ వద్దే ఉండాలని అమరావతి వాసులు కోరడం సబబు కాదని ఆయన అన్నారు. రాజధానికి ఉత్త పుణ్యానికే వారు భూములు ఇవ్వలేదు కదా అని పేర్కొన్నారు. ఎవరైనా భూములిస్తే అభివృద్ధి చేసి ఇవ్వడం సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు. రాజధాని రైతులు భూములిచ్చి త్యాగం చేశామనీ, కాబట్టి ప్రతిదీ తమకే కావాలని కోరుకోవడం స్వార్థపూరిత ఆలోచన అవుతుందనీ మైసూరా అన్నారు. కర్నూలులో ఉన్న రాజధానిని త్యాగం చేశామన్న భావన రాయలసీమ వాసుల్లో ఉందన్నారు.
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రాంతంలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో బలంగా ఉందనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతుందన్న భావోద్వేగాలు సీమ వాసుల్లో ఉందనీ ఆయన అన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని గ్రేటర్ రాయలసీమ రాష్ట్రంగా ఏర్పడితే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని విభజన సమయంలోనే తమ వాదన వినిపించామని గుర్తు చేశారు.
ఒక్క రాయలసీమవాసులే కాకుండా ఉత్తరకోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు కూడా తమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదనే అసంతృప్తితో ఉన్నారని మైసూరా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్నతమ్ముల మాదిరిగా విడిపోతే మంచిదనీ, ఎవరి రాజధానులు వారికి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బంతిని కేంద్రం చేతిలో పెడితే వారే నిర్ణయం తీసుకుంటారనీ, ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఎర్పాటు సాధ్యమేననీ మైసూరా అన్నారు.
This post was last modified on December 22, 2019 11:22 am
May 7: Daily Horoscope in Telugu మే 7 – చైత్ర మాసం – మంగళవారం - రోజు… Read More
Devara: RRR వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ "దేవర" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ… Read More
YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు అని, ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యే చేశారని ఆంధ్రప్రదేశ్… Read More
Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్… Read More
Premalu OTT: ప్రేమలో సినిమా మలయాళ ఇండస్ట్రీని ఏ విధంగా సెట్ చేసిందో మనందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో… Read More
PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ… Read More
Thalaimai Seyalagam OTT: ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హడావిడి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాల పేరిట కూడా అనేక… Read More
The Family Man Season 3: ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి… Read More
Baak OTT Release: టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమర్నా మరియు బొద్దుగుమ్మ రాశి కన్నా మరోసారి కలిసి నటించిన సినిమా… Read More
Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుందో మనందరికీ తెలిసిందే. మలయాళం… Read More
BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక… Read More
AP Elections 2024: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల అనంతపురం ఎస్పీ అన్బురాజన్ ను బదిలీ… Read More
AP DGP: ఏపీ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా నియమితులైయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం… Read More
Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్స్ లిస్ట్ తీస్తే శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. బుల్లితెర రాములమ్మ… Read More
Jyothi Roi: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ప్రదర్శిస్తున్నారు. తెరపై… Read More