(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన కారణంగా ఆ మార్పులను ప్రతిఫలిస్తూ కేంద్రం నేడు రెండు మ్యాపులు విడుదల చేసింది. వాటిలో అన్ని రాష్ట్రాల రాజధానులను ఎర్ర రంగులో మార్కు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏ నగరాన్నీ చూపించలేదు.
వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగడంపై అనిచ్ఛిత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అవరావతి నిర్మాణానికి ప్రస్తుతానికి నిధులు అక్కరలేదని కూడా ముఖ్యమంత్రి జగన్ ఆ మధ్య ప్రధానిని కలిసినపుడు చెప్పారు. నిజానికి రాజధానిగా అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధాని శంఖుస్థాపన చేశారు. మరి కారణం ఏమిటో గానీ తాజాగా రూపొందించిన మ్యాపుల్లో నవ్యాంధ్ర రాజధాని లేకుండా చేశారు.
ఆంధ్రులకు ఎప్పుడూ రాజధాని సమస్యే. మద్రాసు మనదనుకున్నారు. తట్టాబుట్టా సర్దుకురావాల్సివచ్చింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన మద్రాసు నుంచి ఆంధ్రా విడిపోయిన తరవాత కర్నూలుకు పీట వేశారు. కొన్నాళ్లకు తెలంగాణ కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో హైదరాబాద్ను రాజధానిగా స్వీకరించి దానిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. 2014లో తెలంగాణ విడిపోవడంతో నవ్యాంద్రకు మరోసారి రాజధాని లేకుండా పోయింది.
2014 ఎన్నికలలో గెలిచి నవ్యాంధ్రలో మొదటి ప్రభుత్వం ఏర్పరచిన చంద్రబాబు మన రాజధాని అమరావతి అన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానని పెద్ద ఎత్తున భూసేకరణ చేసి పనులు మొదలుపెట్టారు.
ఇంతలో అయిదేళ్లు గడిచిపోయాయి. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసిపి అధికారంలోకి వచ్చింది. రాజధానిగా అమరావతిపై ముందు నుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన వైఎస్ జగన్ అధికారంలోకి రావడం తోటే దానిని అనిచ్ఛితిలోకి నెట్టారు. ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజధాని వికేద్రీకరిస్తామంటారు. ఇంతవరకూ ఏదీ స్పష్టంగా చెప్పలేదు. డోలాయమానంగా తయారయిన అమరావతి ఆఖరికి మ్యాపుల నుంచి కూడా అదృశ్యమైపోయింది.
This post was last modified on November 3, 2019 10:30 am
AP Elections 2024: ఈనెల 13న జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో… Read More
YS Vijayamma: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మార్చి 27న ఇడుపులపాయ నుండి ఎన్నికల ప్రచార బస్సు యాత్ర… Read More
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More