మోదీ ప్రపంచబ్యాంక్ అప్పులన్నీ తీర్చారా..అబ్బే నిజం కాదు!

Published by
Siva Prasad

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు హల్‌చల్ చేస్తోంది. ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇండియా తీసుకున్న రుణం మొత్తాన్నీ ప్రధాని నరేంద్ర మోదీ గత ఆరేళ్లలో పూర్తిగా తీర్చారన్నది ఆ పోస్టు సారాంశం.

పూర్తి మెసేజ్ చెప్పేదేమంటే: ‘గత 70 ఏళ్లుగా ప్రపంచ బ్యాంక్ దగ్గర ఇండియా ఎక్కువ రుణాలు తీసుకుంటున్నది. ఒకప్పుడు పుట్టిన ప్రతి భారతీయుడూ అప్పుతోనే పుట్టాడు. పెద్ద పెద్ద ఆర్ధికవేత్తలు చేయలేని పని ఒక చాయ్‌వాలా చేసి చూపించాడు. గత ఆరేళ్లలో ప్రపంచ బ్యాంక్ అప్పు మొత్తం తీర్చిపారేశారు. యుఎన్‌లో ఫుల్ సెటిల్‌మెంట్ చేసేశారు. ఇండియాలో ఆర్ధిక మాంద్యం ఉందని ఎవరా అంటున్నది’.

ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చేసిన ఒక ట్వీట్ స్క్రీన్ షాట్‌ను ఉపయోగించి ఈ క్లెయిమును ప్రచారంలో పెడుతున్నారు.

ఈ క్లెయిముల్లో వాస్తవం ఎంతో చూడాల్సిందిగా చాలామంది ఆల్ట్‌న్యూస్‌ను కోరారు.

వీటిల్లో చాలావరకూ  నిజాలు కావు.

అక్బరుదీన్ ట్వీట్ ప్రపంచబ్యాంక్‌కు సంబంధించినది కాదు. ఐక్యరాజ్య సమితికు ఇండియా చేయాల్సిన చెల్లింపులకు సంబంధించినది. అక్బరుద్దీన్ అక్టోబర్ 11న చేసిన ట్వీట్ ఈ కింద చూడండి. చెల్లింపులు ఐక్యరాజ్యసమితికని స్పష్టంగా  ఉంది.

అదే రోజు ఐక్యరాజ్యసమితి ఆర్ధిక పరిస్థితిపై ఒక నివేదిక వచ్చింది. దానిని కూడా అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. అక్టోబర్ 11 నాటికి సమితికి అన్ని బకాయిలూ చెల్లించిన దేశాల జాబితా అందులో ఉంది.

సమితి ప్రతి రెండేళ్లకూ ఈ నివేదిక విడుదల చేస్తుంది. సమితికి జరిపే చెల్లింపులు బకాయిలు కావు. సమితి నిర్వహణ కోసం దాని 193 సభ్యదేశాలూ కొంత డబ్బు చెల్లిస్తాయి. ఆ చెల్లింపుల గురించి అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.

ఐక్యరాజ్యసమితి ప్రస్తుతం లోటుతో నడుస్తోంది. సమితి బడ్జెట్లో 70 శాతం నిధులు మాత్రమే సభ్యదేశాల నుంచి అందాయని సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఇటీవల ప్రకటించారు.

సమితి సంగతి ఇలా ఉంటే, ప్రపంచబ్యాంక్‌కు ఇండియా మొత్తం చెల్లింపులు జరిపిందన్న మాట అవాస్తవం. ప్రపంచ బ్యాంక్ సమాచారం ప్రకారం 2019లో ఇండియాకు మొత్తం 327.7 కోట్ల డాలర్ల మేర రుణసహాయం వాగ్దానం చేశారు (ప్రపంచబ్యాంక్‌లో భాగమైన ఐబిఆర్‌డి, ఐడిఎ ఇస్తున్న రుణాలతో కలిసి). 2015 నుంచీ ప్రపంచబ్యాంక్ ఇండియాకు వాగ్దానం చేసి ఆ ప్రకారం అందిస్తున్న రుణసహాయం డేటా కింద చూడండి.

2014 నుంచి ఇప్పటివరకూ నడుస్తున్న 21 ప్రాజెక్టులకు సంబంధించి ఇండియా ఐడిఎకు ఇంకా  110 కోట్ల డాలర్లు చెల్లించాల్సిఉంది. మరో 11 ప్రాజెక్టులకు సంబంధించి ఇండియా ఐబిఆర్‌డికి 230 కోట్ల డాలర్లకు పైగా చెల్లించాల్సిఉంది. ఈ 11 ప్రాజెక్టుల్లో తొమ్మిది యుపిఎ హయాంలో ప్రారంభమయినవి.

2014 మే 24 తర్వాత (మోదీ ప్రధాని పదవి స్వీకరించిన తర్వాత) ఇండియాలో 88 ప్రాజెక్టులకు రుణ సహాయం అందించేందుకు ప్రపంచబ్యాంక్ సంసిద్ధత తెలిపింది. వాటిలో చాలావరకూ పూర్తయ్యాయి. కొన్ని ఇంకా నడుస్తున్నాయి. కొన్ని రద్దయ్యాయి. ప్రపంచబ్యాంక్‌లో భాగమైన ఐబిఆర్‌డి తాజాగా ఒదిషాలో వ్యవసాయం – నీటిపారుదల రంగానికి సంబంధించిన ఒక ప్రాజెక్టుకు 16.5 కోట్ల డాలర్ల మేర సహాయం వాగ్దానం చేసింది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఇంకా సంతకాలు కావాల్సిఉంది.

పై సమాచారం నరేంద్ర మోదీ వచ్చి  ప్రపంచబ్యాంక్ అప్పులన్నీ తీర్చారాన్న మాట నిజం కాదని స్పష్టం చేస్తున్నది. 2016లో ప్రపంచబ్యాంక్ ఒక నివేదిక విడుదల చేసింది. స్వాతంత్ర్యానంతరం ప్రపంచబ్యాంక్ నుంచి అత్యధికంగా రుణసహాయం పొందిన దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉందని ఆ నివేదికలో తెలిపారు.

అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇండియా ఇప్పటికీ  వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు ప్రపంచబ్యాంక్ ఆర్ధిక సహాయంపై ఆధారపడుతున్నది. ఈ రుణాల చెల్లింపులకు ఒక పద్ధతి, కాలపరిమితి ఉంటాయి కాబట్టి చాలా రుణాలు ఇంకా తీర్చాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకు బీహార్‌లో ఉపాధ్యాయుల సమర్ధతను పెంచే ఒక ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంక్ సహాయం ఒప్పందంపై 2015లో సంతకాలు జరిగాయి. ఈ ప్రాజెక్టు 2020 జూన్ వరకూ అమలవుతుంది. ఈ రుణం తీర్చడానికి ఇండియాకు 2040 వరకూ  వ్యవధి ఉంది.

‘ఆల్ట్‌న్యూస్‘ వెబ్‌సైట్ సౌజన్యంతో

This post was last modified on October 23, 2019 7:34 pm

Siva Prasad

Recent Posts

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More

May 11, 2024

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More

May 11, 2024

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More

May 11, 2024

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More

May 11, 2024

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More

May 11, 2024

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

రాజ‌కీయాల్లో నేత‌ల ప్ర‌భావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్ర‌భావ‌మే ఎక్కువ‌గా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది… Read More

May 11, 2024

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More

May 11, 2024

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More

May 11, 2024

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More

May 11, 2024

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More

May 11, 2024

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More

May 11, 2024

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More

May 10, 2024

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More

May 10, 2024