అటు గాంధీభవన్లోను విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి జాతీయ జెండా ఎగురేశారు. స్వాతంత్ర్య సమరయోధులను ఉత్తమ్ సన్మానించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఖాశీంరజ్వీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందన్నారు. సర్దార్ పటేల్ చొరవతో భారత్లో హైదరాబాద్ విలీనమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే బీజేపీ దీనికి మతం రంగు పూసే ప్రయత్నం చేసిందని, హైదరాబాద్ విలీనానికి మతంతో సంబంధం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు.
1947 ఆగష్టు 15న భారతవనికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం నవాబు పాలనలోనే ఉండిపోయింది. బ్రిటిషర్లకు సామంతుడిగా ఉన్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్వతంత్రంగా ఉండటానికి మొగ్గు చూపాడు. హైదరాబాద్ ప్రాంత ప్రజలు భారత్లో కలవడానికి మొగ్గు చూపినా.. నిజాం నవాబు మాత్రం అందుకు అంగీకరించలేదు. నిజాం పాలనలో రజాకర్లు చెలరేగిపోయారు. అప్పట్లో రాజాకార్ల పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేసిన ఖాసిం రజ్వీ… మారణకాండకు తెగబడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక దాదాపు 13 నెలలపాటూ… తెలంగాణ ప్రజలు చూడని నరకం లేదు. సామాన్య ప్రజానీకంపై వీరి అరాచకాలు సాగాయి. గ్రామాలపై పడి ఆస్తులను దోచుకున్నారు. హత్యాకాండను సాగించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ పోరాటాన్ని ప్రారంభించాయి. ఈ సంస్థలన్నింటినీ ఉస్మాన్ అలీఖాన్ నిషేధించాడు. దేశం మధ్యలో ఉన్న సువిశాల ప్రాంతం భారత యూనియన్లో చేరకపోతే.. అది దేశ మనుగడకే ముప్పు. దీంతో హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్యకు దిగాలని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని విపక్షాలు కోరుతున్నాయి. కానీ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం… అందుకు ససేమిరా అంటోంది. మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణం వల్లే టీఆర్ఎస్ వెనకడుకు వేస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై ఇటీవలే సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు అసలైన విముక్తి.. విమోచనం.. 2014 జూన్ 2 అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న ఎవరికి నచ్చింది వాళ్లు చేసుకోవచ్చునని.. అలాగని శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని భావించిన మాట నిజమేనని.. కానీ అన్నీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. గతాన్ని మళ్లీ తవ్వడమెందుకన్న ఉద్దేశంతో ఆరోజు ఎలాంటి దినోత్సవాన్ని జరపడం లేదన్నారు.
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More
Karthika Deepam 2 May 11th 2024 Episode: పారు బంటుని సీక్రెట్ గా కలుస్తూ ఉంటుంది. దీప ఇంట్లో… Read More
Brahmamudi:అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని సుభాష్ తో చెప్పడంతో, దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణకు నిజం తెలిస్తే తట్టుకోలేదు… Read More
CM Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మాటలను సొంత చెల్లెలు, కన్న తల్లి కూడా నమ్మడం లేదని… Read More
Nuvvu Nenu Prema:విక్కీ,పద్మావతి చేత అరవింద కోరిక ప్రకారం శ్రీరామనవమి పూజ చేయించడానికి పంతులుగారు వస్తారు. విక్కీ పద్మావతి రెడీ… Read More
Krishna Mukunda Murari:కృష్ణ హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత భవానీ దేవి ఇంట్లో పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. కృష్ణ… Read More
May 11: Daily Horoscope in Telugu మే 11 – వైశాఖ మాసం – శనివారం - రోజు… Read More
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More