రావణుడు, ధుర్యోధనుడు లాంటి వారితో పోల్చి చంద్రబాబుపై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం వైఎస్ జగన్

Published by
sharma somaraju

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో సారి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష కార్యక్రమాన్ని బుధవారం సీఎం జగన్ ప్రారంభించరు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ..తనకు తాను పార్టీ పెట్టుకుని ఎవరైనా అధికారంలోకివస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని, సొంత కుతురును ఇచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన పెట్టిన పార్టీని సొంతం చేసుకుంటే వారిని చంద్రబాబు అంటారని జగన్ అన్నారు. రావణుడిని సమర్దించిన వారిని రాక్షసులని, దుర్యోధనుడిని కొమ్ము కాసిన వారిని దుష్ట చతుష్టయం అని అంటారని, అలాంటి చంద్రబాబును ఏమనాలని జగన్ ప్రశ్నించారు.

AP CM YS jagan

నేడు ప్రజాస్వామ్యానికి అర్ధం లేకుండా పోయిందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక సారి కాదు, రెండు సార్లు అనేక సార్లు ప్రజలను మోసం చేశారని, అటువంటి చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలా, మీసేవలు మాకొద్దు బాబోయ్ అని గుడ్ బై చెప్పి ఇంటికి పంపాలా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. చంద్రబాబుకు మరో ఛాన్స్ ఇవ్వవచ్చా అని జగన్ ప్రశ్నించారు. ఇవేళ రాజకీయాలు చాలా దారుణంగా తయారైయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన జగన్.. రాజకీయాల్లో నలుగురు తోడు ఉండే ప్రజల గురించి ఆలోచించాల్సిన పని లేదన్నట్లుగా తయారైయాయని అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు కు లేదని విమర్శించారు. తాను దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదనీ, కేవలం దేవుడు, ప్రజలను నమ్ముకున్నానని జగన్ అన్నారు. వాళ్లు చెప్పే అబద్దలు ప్రజలు నమ్మవద్దనీ, తమ ఇళ్లల్లో మంచి జరిగిందా లేదా అన్నదే  కొలమానంగా పెట్టుకుని మంచి జరిగితే జగన్ కు అండగా నిలవాలని ప్రజలకు కోరారు సీఎం జగన్.

రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం రీసర్వే చేసి భూహక్కు పత్రాలను అందిస్తున్నామని జగన్ తెలిపారు. అత్యాధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయంగా భూసర్వే చేపడుతున్నామన్నారు. 17వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూముల సర్వే చేస్తున్నామనీ, రెండేళ్ల క్రితం ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన జరిగాయన్నారు. 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలను అందించామనీ, ఫిబ్రవరి లో రెండో దశ నాలుగు వేల గ్రామాల్లో సర్వే, మే 2023 కల్లా ఆరు వేల గ్రామాల్లో భూహక్కు పత్కాలు, ఆగస్టు 2023 కల్లా 9వేల గ్రామాల్లో సర్వే పూర్తి అవుతుందని సీఎం జగన్ తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్రమంతటా సమగ్ర సర్వే పూర్తి అవుతుందని చెప్పారు.

ఇప్పటి వరకూ సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల సివిల్ కేసులతో రైతులు నష్టపోతున్నారనీ, ఆ పరిస్థితులను మార్చాలని అడుగులు ముందుకు వేయడం జరిగిందని సీఎం జగన్ తెలిపారు. తమ ఆస్థిని కుటుంబ సభ్యులకు సక్రమంగా అందజేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని అన్నారు. ఇక రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయాల్లోనే జరుగుతాయని జగన్ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ బాధితులను కూడా పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డయాలసిస్ రోగులకు పదివేల చొప్పున ఇస్తున్నామన్నారు. ఇదే క్రమంలో నరసన్నపేట ఆర్ అండ్ బీ రహదారి విస్తరణ, మలపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేత హాజరీపై హైకోర్టులో విచారణ..సుప్రీం కోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ అన్న హైకోర్టు

sharma somaraju

Share
Published by
sharma somaraju

Recent Posts

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

Naga Panchami: పంచమి వాటర్ కోసం గదిలో నుండి కిందికి వస్తుంది.ఖరాలి తన మంత్ర శక్తిని జ్వాల జ్వాల శరీరంలోకి… Read More

May 5, 2024

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి అగ్రనేతలు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీ… Read More

May 4, 2024

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Pushpa: అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న 'పుష్ప 2: ది రూల్' నుంచి రిలీజ్ అయిన మొదటి… Read More

May 4, 2024

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

Terrorists Attack: లోక్ సభ ఎన్నికల వేళ జమ్ము – కశ్మీర్ లో ఉగ్రదాడి చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని శశిధర్… Read More

May 4, 2024

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి,… Read More

May 4, 2024

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్ధి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు స్వగ్రామమైన… Read More

May 4, 2024

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

Lok Sabha Elections 2024: దేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి కేంద్రంలో ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి… Read More

May 4, 2024

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

Madhuranagarilo May 4 2024 Episode 354: చెప్పు రుక్మిణి మమ్మల్ని ఎందుకు వద్దు అంటున్నావ్ చెప్పు కారణమేంటి అని… Read More

May 4, 2024

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

BRS: లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరస షాక్ లు ఇస్తున్నారు ఆ పార్టీ కీలక నేతలు.… Read More

May 4, 2024

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

Malli Nindu Jabili May 4 2024 Episode 639: అరవింద్ మాటలు విని వెళ్లడానికి ఒప్పుకుంటుందా ఏంటి అని… Read More

May 4, 2024

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218:  స్వర అభిషేక్ సినిమాకి బయలుదేరుతారు. అసలు మీకు బండి నడపడం… Read More

May 4, 2024

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

Trinayani May 4 2024 Episode 1230: నీ చావు తెలివితేటల వల్ల ఇంకొకరు చచ్చే పరిస్థితి తీసుకురాకు చిట్టి… Read More

May 4, 2024

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

Guppedanta Manasu May 4 2024 Episode 1066: రాజివ్ తనలో తానే మాట్లాడుకుంటూ శైలేంద్ర కు ఫోన్ చేస్తాడు… Read More

May 4, 2024