Jagan Strategy: వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15వ తేదీ నుండి ఓ భిన్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఈ పార్టీ 15వ తేదీ తరువాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సహా ముఖ్యమైన బీసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలు మామూలుగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు కాదు. స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉంది. జగన్మోహనరెడ్డి పార్టీ పరంగా ఏ కార్యక్రమం తీసుకున్నా దానిలో పక్క వ్యూహం, రాజకీయ అజెండా దాగి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మొదటి నుండి ఆ పార్టీకి బీసీలే వెన్నెముక. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావం నుండి బీసీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. 1983 లో ఎన్టీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిని చూసుకుంటే చింతకాయల అయ్యన్నపాత్రుడు, కింజరపు ఎర్రం నాయుడు. అచ్చెన్నాయుడు, ఇప్పుడు ఆ పార్టీలో లేకపోయినా తమ్మినేని సీతారామ్ ఇలా చాలా మంది బీసీ నాయకులు టీడీపీ ద్వారా రాజకీయంగా ఎదిగారు. ఇప్పటి వరకూ రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త నాయకత్వాన్ని తీసుకువచ్చింది ఎన్టీఆర్. అందుకే మొదటి నుండి టీడీపీకి ఆ వర్గం వెన్నుదన్నుగా నిలిచింది. అయితే 2004 నుండి టీడీపీలో బీసీ నాయకత్వం తగ్గుతూ వచ్చింది. 2014లో మళ్లీ ఆదరించారు. 2019 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. అయితే ఇప్పుడు ఏపిలో రండు పార్టీలు ఒక ప్లాన్ ప్రకారం ఉన్నాయి.
ఈ నెల 15 నుండి వైసీపీ ప్రత్యేకంగా బీసీ సదస్సులు ఎందుకు నిర్వహిస్తుంది అనేది పరిశీలిస్తే..తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. కాపు సామాజికవర్గ ఓట్ల మీద ఫోకస్ పెడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు వైసీపీ లక్ష్యం ఏమిటంటే ..? గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గానికి, బీసి సామాజిక వర్గానికి కొంత గ్యాప్ స్పష్టంగా కనబడుతుంది. కాపులు తమను బీసీల్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. అదే జరిగినా, లేక కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు రిజర్వేషన్లు తగ్గిపోతాయి. రిజర్వేషన్లు 50శాతం లోపే ఉండేలన్న సుప్రీం కోర్టు తీర్పు మేరకు కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తే ఆ మేర బీసీలు నష్టపోతారు. అందుకే వారు కాపులను బీసిల్లో కలపడానికి, రిజర్వేషన్లు కల్పించడానికి వ్యతిరేకిస్తున్నారు.
అందుకే ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో బీసీలకు, కాపులకు మధ్య బాగా గ్యాప్ ఉంది. ఒక వేళ జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే కాపు సామాజికవర్గం టీడీపీ వైపు మొగ్గు చూపితే కఛ్చితంగా బీసీ సామాజికవర్గం ఆలోచన చేస్తుంది. గోదావరి జిల్లాల్లో యాంటీ కాపు ఓటింగ్ ను తమ వైపుకు తిప్పుకునే ఉద్దేశంతో బీసీల సదస్సులను నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహనరెడ్డి కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోనే కాపుల రిజర్వేషన్ కల్పించడం సాధ్యం కాదు. దానికి తాను వ్యతిరేకం అని స్పష్టమైన ప్రకటన చేశారు. చాలా మంది జగన్మోహనరెడ్డి ఏమిటి అలా ప్రకటించారు అని అనుకున్నారు. కానీ అందులో జగన్మోహనరెడ్డికి పక్కా వ్యూహం ఉంది. తనకు వేయాల్సిన కాపు ఓటింగ్ ఎలానూ పడుతుంది. టీడీపీ అనుకూలంగా ఉండే బీసీ ఓటింగ్ ను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రత్యేక వ్యూహం, స్ట్రాటజీతో మాట్లాడారు. దీని వల్ల కాపులకు రిజర్వేషన్ వ్యతిరేకించి బీసీ వర్గాలు వైసీపీకి మద్దతు పలికారు.
ఇప్పుడు జనసేన తో టీడీపీ పొత్తు పెట్టుకుని పయనిస్తే బీసీలను కాపులకు, జనసేనకు, టీడీపీకి దూరం చేయాలన్నది వైసీపీ వ్యూహం. ఇదే క్రమంలో బీసీల ఓటింగ్ కాపాడుకునేందుకు కూడా టీడీపీ కూడా జనాల్లోకి వెళ్లాలని భావిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీ వర్గాలకు ఆదరణ పథకం కింద రాయితీ పథకాలు ఇచ్చిన విషయాన్ని, మొదటి నుండి బీసీలను రాజకీయంగా ప్రోత్సహించిన అంశాలను జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు టీడీపీ సిద్దం అవుతోంది. సో..ఇప్పుడు రెండు పార్టీలు బీసీల పాట పాడుతున్నాయి. వైసీపీ 75 నియోజకవర్గాల మీద దృష్టి పెట్టింది. 56 కార్పోరేషన్లు ఏర్పాటు, బీసీల సబ్ ప్లాన్ కు 31 కోట్లు ఖర్చు పెట్టడం, బీసీల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలను చైతన్య సదస్సులో వివరించేందుకు వైసీపీ సమాయత్తం అవుతోంది.
Pawan Kalyan: గబ్బర్ సింగ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. మండుటెండల్లో బాక్స్ ఆఫీస్… Read More
Karthika Deepam: ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా ఓ రేంజ్కి తీసుకెళ్లిన సీరియల్ ఏదైనా ఉంది అంటే నిర్మోహమాటంగా… Read More
Vijay Devarakonda: ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి తోబుట్టులు ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు రానివ్వడం లేదు. ఇక… Read More
Janaki Kalaganaledu: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు రెండు చేతుల నిండా సంపాదిస్తూ హౌస్ మరియు కార్లు వంటి పెద్ద… Read More
Vadinamma: అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ… Read More
Shyamala: యాంకర్ శ్యామల.. సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. పద్ధతిగా మరియు సమయస్ఫూర్తితో యాంకరింగ్ చేయగలిగిన నైపుణ్యం ఆమె… Read More
ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు కౌన్ డౌన్ షురూ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రోజున ఎన్నికల… Read More
రాజకీయాలు చేయొచ్చు. సెంటిమెంటును కూడా పండించుకోవచ్చు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందు కు అనేక కుస్తీలు కూడా పట్టొచ్చు. కానీ, అతిగా… Read More
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More