AP Employees: ‘పీఆర్సీ’పై రాష్ట్ర ప్రభుత్వానికీ, ఉద్యోగ సంఘాలకు మధ్య సయోధ్య కుదరడం లేదు. వాద, ప్రతివాదనలతో సమస్యను పెంచుకుంటున్నారు తప్పితే.. పరిష్కార మార్గాలు చూడటం లేదు. చర్చలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటిస్తే.. పీఆర్సీ జీవో రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. మీరు వస్తేనే కదా సమస్యలు చర్చించి పరిష్కరించేది..? అని ప్రభుత్వం అంటోంది. మొత్తంగా ఇద్దరి మధ్యా ట్యాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసినా చర్చలకు రావడంలేదు ఉద్యోగులు. మరోవైపు.. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. ఇప్పటికే నిరసనలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
చర్చలకు రావాలి కదా..
‘ఉద్యోగ సంఘాలను మూడు సార్లు చర్చలకు పిలిచాం. వస్తారని ఎదురు చూస్తున్నా వారు రావడం లేదు. కమిటీకి అధికారం లేదన్నారని.. అధికారికంగా జీవో ఇచ్చి పిలిచినా రాకపోవడం ఏంటి? ఎక్కడో కూర్చుని డిమాండ్స్ చేస్తే కాదు.. మెట్టు దిగితేనే సమస్య పరిష్కారం అవుతుంది. జేఏసీలోని సంఘాలే కాకుండా ఇతర సంఘాలు వచ్చినా మాట్లాడతాం. ఇమ్మెచ్యూరిటీతో ఆలోచిస్తున్న నాయకులకు ఉద్యోగులు చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమ్మె చేయడం విరుద్ధం. సమస్య జఠిలం కాకుండా పరిష్కరించుకోవాలి. హెచ్ఆర్ఏ తగ్గిందో లేదో ఉద్యోగుల వచ్చి మాతో మాట్లాడాలి. మీడియాలో మాట్లాడితే ఎలా..? పిఆర్సీకి అంగీకరించి ఇపుడు సమ్మెకు వెళ్లడం ఏంటో ఉద్యోగ సంఘాలు ఆలోచించుకోవాలి. ఉద్యోగులు జీతాలు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలుంటాయి’ అని అన్నారు.
మీరు సాక్ష్యం కాదా..
దీనికి ఉద్యోగ సంఘాలు.. ‘పీఆర్సీకి ఎప్పుడు అంగీకరించామో సజ్జల చెప్పాలి. అశుతోష్ నివేదికపై చర్చిద్దామని సజ్జల చెప్పలేదా..? పీఆర్సీపై జీవోకు సజ్జల సాక్షి కాదా..? ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీతోనే చెప్తున్నామా..? ఇంకెన్ని సంఘాలను చీల్చుతారు..? కొత్త జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వానికి ఎందుకు ఉత్సాహం..? పీఆర్సీతో నష్టమని సీఎస్, మంత్రుల కమిటీకి విన్నవించినా పట్టించుకోలేదు. అశుతోశ్ కమిటీ నివేదిక బయటపెడితే, పాత జీతాలు ఇస్తే, జీవో వెనక్కి తీసుకుంటే చర్చలకు వస్తామని రోజూ సచివాలయానికి ఓ బృందాన్ని పంపిస్తున్నా.. రావట్లేదంటారా..?’ అని ధీటుగా స్పందించాయి. దీంతో.. ఇద్దరి మధ్యా గ్యాప్ పెరుగుతుందే గానీ తగ్గట్లేదు. మరోవైపు.. సమ్మె సమయం దగ్గరపడుతోంది. మరి.. సమస్యకు పరిష్కారమెప్పుడో.. ఎలానో..!?
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More