ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు చేయలేని పనిని ఆయన అనుభవం అంత లేని వయసు నాయకుడు జగన్ చేసి చూపించారు. ఇది ఆయన తెగింపునకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ బాబు, మద్దాలి గిరిధర్ రావు వైసీపీకి జై కొట్టారు. నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా వారిపై పార్టీ పరంగా సస్పెన్షన్ వేటు వేయలేదు చంద్రబాబు. దీంతో వారు అసెంబ్లీలో అధికారికంగా టీడీపీ సభ్యులుగానే ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో వైసీపీ సమన్వయకర్తలుగా కొనసాగుతున్నారు. అయితే వీరిని చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయలేకపోయారు. అంటే దానికి ఒక కారణం ఉంది.
ఆ నలుగురిని పార్టీ నుండి చంద్రబాబు సస్పెండ్ చేస్తే వారు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. అధికారికంగా వైసీపీలో చేరే అవకాశం ఏర్పడుతుంది. వారు స్వతంత్ర సభ్యులు అయితే అసెంబ్లీలో టీడీపీ బలం 23 నుండి 19కి పడిపోతుంది. పర్వవసానంగా చంద్రబాబుకు ఉన్న ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుంది. దీనికి భయపడే చంద్రబాబు ఆ స్టెప్ తీసుకోలేదని అంటారు. ఇదే విషయాన్ని ఇటీవల వల్లభనేని వంశీ కూడా తెలిపారు. తమను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆయన (చంద్రబాబు) కు ప్రతిపక్ష నాయకుడి హోదా పోతుందని అందుకే సస్పెండ్ చేయడం లేదని అన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని జగన్మోహనరెడ్డి .. ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి నిర్మోహమాటంగా ఎటువంటి వివరణ అడగకుండానే సస్పెండ్ చేసేశారు. ఇది నిజంగా డేరింగ్ స్టెప్ అనాల్సిందే. ఎందుకంటే..
వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు తన సామాజికవర్గానికే చెందిన వారు కావడంతో పాటు సీనియర్ నేతలు. ఒకరు మాత్రమే జూనియర్ ఎమ్మెల్యే. పార్టీ కట్టుదాటితే ఎంతటి సీనియర్ లు అయినా, బ్లంట్ ఫాలోవర్స్ అయినా ఉపేక్షించేది లేదు అన్న సంకేతం ఇచ్చారు సీఎం జగన్. ప్రస్తుతం పార్టీ బహిష్కరణకు గురైన వారిలో అనం రామనారాయణరెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ, కాంగ్రెస్ హయంలో వివిధ శాఖల మంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారు. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరు నెల్లూరు జిల్లాలోని రెండు మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా క్యాడర్ ఉన్న నాయకులు. వీరి తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయులు. ఆ కారణంగా జగన్మోహనరెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు మద్దుతుగా మేకపాటి చంద్రశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుండి క్రియాశీలకంగా పని చేశారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి 20వేల పైచిలుకు మెజార్టీతోనే విజయం సాధించారు. ఈ ముగ్గురితో పాటు తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఉండవల్లి శ్రీదేవి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఈ చర్యలతో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న సంకేతం ఇచ్చినట్లు అయ్యింది. చంద్రబాబుకు, జగన్ కు మధ్య తేడా ఇదీ. నలుగురు ఎమ్మెల్యేలు కట్టుదాటినా పార్టీ పరంగా చంద్రబాబు చర్యలు అయితే తీసుకోలేదు కానీ జగన్మోహనరెడ్డి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసేశారు. అందుకే ఈ విషయంలో ‘దటీజ్ జగన్’ అనాల్సిందేగా..!
MLA Sridevi: ‘జగన్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యింది’
This post was last modified on March 27, 2023 12:26 am
May 6: Daily Horoscope in Telugu మే 6 – చైత్ర మాసం – సోమవారం - రోజు… Read More
Amit Shah: ఏపీ రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి… Read More
Escape Room 2 Review: సైకలాజికల్ అండ్ సర్వైవల్, మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన సినిమా ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్ లోకి… Read More
Aa Okkati Adakku Box Office Collections: అలానే నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం అంచనాలను… Read More
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు పడింది. డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డిని… Read More
Romeo OTT: రోమియో సినిమా రిలీజ్ కి ముందు మంచి ఏర్పడిన సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ట్రైలర్ ఎంటర్టైనర్… Read More
టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపు కోసం.. వ్యయ ప్రయాసలకు ఓర్చుతున్నారు. రోజంగా ఎండను సైతం లెక్కచేయకుండా తిరుగుతూనే ఉన్నారు. ప్రజలకు… Read More
రాష్ట్రంలో ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేతకు జై కొడతారు? అంటే… Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 64 సీట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో అధికారం… Read More
Heeramandi OTT: బాలీవుడ్ దగ్గర దర్శకుడు సంజయ్ లీల భన్సాలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా… Read More
Aha OTT: ఇండియా వ్యాప్తంగా ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్ఫారం అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల… Read More
Geethanjali Malli Vachindi OTT: హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ భారీ అంచనాలతో… Read More
Chandrababu: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు నమోదు చేసింది.… Read More