Chandrababu: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు నమోదు చేసింది. ఇప్పటికే సీఐడీ ఆయనపై సుమారు అరడజను కేసులు నమోదైన ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా చంద్రబాబు తో పాటు ఆయన తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఇప్పుడు కేసు మాత్రం ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాల మేరకు నమోదు అయ్యింది. లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఐవిఆర్ఎ కాల్స్ తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ చేపట్టాలని ఏపీ సీఐడీకి ఆదేశించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు.. చంద్రబాబును ఏ 1 గా, లోకేష్ ను ఏ 2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.