బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ – షా టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ఇటీవల భేటీ అయి రెండు రోజులు గడిచిపోయింది. అయినా సరే ఆ ఉత్కంఠ, వారి మధ్య జరిగిన అంతర్గత వ్యవహాారాలపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు కలిశారు..? జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఎందుకు ఆహ్వానించారు..? ఆయనను కలవడానికి ముందే రామోజీ రావును ఎందుకు కలిశారు..? అసలు అమిత్ షా, బీజేపీ వ్యూహం ఏమిటి..? దీన్ని వైసీపీ వైపు నుండి ఒకలా.. విశ్లేషించుకుంటుంటే , టీడీపీ మరో లా విశ్లేషించుకుంటోంది. ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఏదైనా నాలుగు గోడల మధ్య ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారం బయటి కాదు. అయితే చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులు చూసుకుని ఎవరికి తోచినట్లు వారు చెప్పడమే. ఏయే కోణంలో చర్చ జరిగే అవకాశం ఉంది ..? అనేది ఇంతకు ముందే “న్యూస్ ఆర్బిట్” ఓ ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా వస్తున్న వాదనలు ఏమిటంటే..?
మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?
ఆయా పార్టీల కోణం నుండి ఆలోచిస్తే.. వైసీపీ నేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డే ఈ భేటీ ని ఏర్పాటు చేయించారు, దీని వెనుక జగన్ స్కెచ్ ఉందని కొందరు చెబుతుంటే, లేదు వేరే బిగ్ ప్లాన్ ఒకటి ఉందని, దీని వెనుక కమ్యునిటీ స్కెచ్ ఉందని మరి కొందరు అంటున్నారు. ఇందులో ఏది నిజం..? అసలు వారు ఎమి అనుకుంటున్నారు.. ? వారి ఊహాగానాలు ఏమిటి ..? అనేది పరిశీలిస్తే.. జగన్మోహనరెడ్డి ఈ భేటీని ఎందుకు ఏర్పాటు చేయించారు అంటే ..జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు అంటే గిట్టడం లేదు. టీడీపీ అంటే ఆయనకు అభిమానం ఉంది. టీడీపీ వాళ్లలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులు టీడీపీలో ఉన్నారు. ఆయనకు చంద్రబాబుకు, లోకేష్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబును సీఎం చేస్తే మళ్లీ లోకేషే రాజకీయంగా వారసుడిగా పాతుకుపోతాడు కాబట్టి ఎన్టీఆర్ కు కీలకమైన పాత్ర కావాలంటే చంద్రబాబు హవా తగ్గాలి కాబట్టి జగన్మోహనరెడ్డి టీడీపీని మళ్లీ ఓడించడానికి బీజేపీతో చేతులు కలిపి జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీకి వ్యతిరేకంగా పని చేయమని అమిత్ షాను పంపించారు అన్నట్లుగా వైసీపీ వైపు నుండి ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నాని సన్నిహితం కావడంతో ఆయనతో చెప్పి పంపించారు అన్నట్లు గా వైసీపీలోని కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరం అవుతున్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది. ఇది బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి ఎన్టీఆర్ ను టీడీపీకి దూరం చేసి అవసరమైతే పరోక్షంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చూస్తుంది అని వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు, వాస్తవం కాదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
కొంత మంది దీనిలో కమ్యూనిటీ కోణం ఉంది అని అంటున్నారు. ఏపిలో ఎక్కడా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ కమ్యూనిటీని దూషించడం ఎక్కువ అవుతోంది. మాట్లాడితే ఆ కమ్యూనిటీ మీద పడుతున్నారు. కాబట్టే సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ (బీజేపీ రాజ్యసభ సభ్యుడు) ఈ భేటీ ఏర్పాటు చేశారు అనేది మరో వాదన. రామోజీరావు ఆ కమ్యూనిటీకి పెద్ద. ఎన్టీఆర్ ఆ కమ్యూనిటీకి ఐకాన్. సో.. బీజేపీ సహకారంతో మళ్లీ టీడీపీని ఏపి గద్దె నెక్కిస్తే ఆ కమ్యూనిటీ పెత్తనం ఉంటే ఈ అనవసరమైన కేసులు, ఇబ్బందులు రాకుండా ఉంటాయి అన్న అభిప్రాయం వారిలో ఉంది. బీజేపీ తెలంగాణలో టీడీపీ సపోర్టు తీసుకుని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీకి సపోర్టు ఇవ్వాలి, వైసీపీకి వ్యతిరేకంగా పని చేయాలని కమ్యూనిటీ పెద్దలు నిర్ణయించారని దానిలో భాగంగా అమిత్ షాను రామోజీరావు కలిసి ఈ అంశంపై చర్చించారనీ, అందుకే పని లో పని గా ఎన్టీఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఉంది కాబట్టి, సౌత్ ఇండియాలో మంచి పేరు ఉంది కాబట్టి, మరో పక్క ఎన్టీఆర్ తల్లి బ్రాహ్మణ సామాజికవర్గం కు చెందిన మహిళ కాబట్టి బీజేపీకి ఎంతో కొంత దగ్గర అయితే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలంగాణలో ఉపయోగపడుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమైనా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీ ఎన్టీఆర్ ను వాడుకోవాలని చూస్తుందేమో అన్న చర్చ కూడా ఉంది. తాజాగా కమ్యూనిటీ యాంగిల్ కూడా బయటకు వచ్చింది. అయితే ఈ వాదనను, ప్రచారాన్ని కొట్టి పారేయడానికి వీలు లేదు. మరో పక్క దివంగత సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వడానికి బీజేపీ రెడీ అవుతుంది తద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీని దగ్గర చేసుకుని తెరవెనుక కొన్ని ప్లాన్లు సిద్దం చేసుకుంది ద్వారా టీడీపీలో ఒక వర్గాన్ని బీజేపీకి దగ్గర చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పాతుకుపోవచ్చు అని అనుకుంటుంది అని మరో ప్రచారం జరుగుతోంది. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడంలో ఇన్ని ప్లాన్స్ ఉన్నట్లుగా ఎవరికి తోచినట్లు వారు చెబుతున్నారు. ఈ ప్రచారాల్లో ఏది నిజం అనేది వారి ఇద్దరికే (అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్) తెలియాలి.
Nuvvu Nenu Prema:కృష్ణ ఇంటికి రావడంతో విక్కీ పట్టరాని కోపంతో ఉంటాడు. పద్మావతి ఇప్పుడు మనం గొడవ పడడం కరెక్ట్… Read More
Krishna Mukunda Murari:కృష్ణ మురారితో మాట్లాడుతూ మనిద్దరం సంతోషానికి కలిగే బిడ్డని నా కడుపులోనే మోస్తే ఎంతో బాగుండేది కదా… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైయస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పు వంశం మరోసారి తెరపైకి వచ్చింది. మొన్నటి… Read More
కాంగ్రెస్ పార్టీ... ఇది ఒక మహాసముద్రం అని చెబుతూ ఉంటారు. ప్రతి ఒక్క నాయకుడికి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుందని చెబుతారు.… Read More
రాజకీయాలంటే రాజకీయాలే. చప్పగా చేస్తామంటే కుదరదు. ప్రత్యర్థి ఎత్తుగడలు.. లోతుపాతులు గుర్తిం చి ఇవతల పక్షం అడుగులు వేయాల్సి ఉంటుంది.… Read More
May 9: Daily Horoscope in Telugu మే 9 – వైశాఖ మాసం – గురువారం - రోజు… Read More
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More