MP Vijaya Sai Reddy: ఆ నంబర్ 2 ఏమయ్యారు..! ఢిల్లీ పెద్దలతో విజయసాయిరెడ్డి సీక్రెట్ భేటీలు..!!

Published by
Srinivas Manem

MP Vijaya Sai Reddy: సాధారణంగా నెంబర్ 2 అంటే గతంలో అంకెలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ మన రాష్ట్రంలో నెంబర్ 2 అంటే గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి విజయసాయి రెడ్డి పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సీఎం జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెడ్డి ఏ 2 గా ఉన్నారు. మరో వైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాక ముందు వరకూ ఆయనే నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. జగన్మోహనరెడ్డికి అత్యంత సన్నిహితుడుగా అన్నీ తానై అయి చక్రం తిప్పారు. 2014 లో పార్టీ ఓడిపోయిన తరువాత వైసీపీకి బ్యాక్ బోన్ గా ఉండి సోషల్ మీడియా వెపన్స్ ను తయారు చేసి మొత్తం అండగా నిలబడిన విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత క్రమేణ ప్రభావం, ప్రాభవం పార్టీలో తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే జగన్మోహనరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆయనను ఇన్ చార్జి గా పెట్టారు, అయితే కొన్ని రాజకీయ మార్పులు దృష్యా, ఆయనపై కొత్తగా వస్తున్న ఆరోపణల దృష్యా, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వైసీపీ నాయకులకు విజయసాయి రెడ్డితో ఏర్పడిన విభేదాల దృష్యా విజయసాయి రెడ్డి గతం కంటే కొంత స్పీడ్ తగ్గించారు. నిజానికి ఆయనకు ఉన్న స్పీడ్ కు, ఆయనకు ఉన్న తెలివితేటలకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్ లో ఉండాల్సింది. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ చార్జిగా ఇచ్చి ఢిల్లీ వ్యవహారాలు చూసుకోమని నియమించారు. కానీ సొంత పార్టీ నేతలతో విభేదాలు కారణంగా ఉత్తరాంధ్రకు దూరం అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఢిల్లీలోనూ జగన్మోహనరెడ్డి అనుకున్నట్లు విజయసాయిరెడ్డి చేయలేకపోవడంతో అదే విధంగా జగన్మోహనరెడ్డి అంచనాలు అందుకోలేకపోవడంతో విజయసాయిరెడ్డిని కాస్త పక్కన పెట్టినట్లుగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

MP Vijaya Sai Reddy priority Decreased?

MP Vijaya Sai Reddy: ఢిల్లీలో రహస్య భేటీలు

విజయసాయిరెడ్డిపై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలు పక్కన బెడితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోజు ఒకటి లేదా రెండు ట్వీట్ లతో ప్రతిపక్ష టీడీపీని అటు జనసేన పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు బీజేపీపైనా విమర్శలు చేస్తూ ఇరుకున పెట్టేవారు. ట్విట్టర్ లో నిత్యం ప్రత్యర్థులను రెచ్చగొట్టి మరీ విమర్శలు చేయించుకునేది విజయసాయిరెడ్డి.  అటువంటి విజయసాయి రెడ్డి ట్విట్టర్ ఈ మధ్య బోసిపోయింది. ఆయన మీద పంచ్ లు వేయడానికి జనసేన, టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. ఆయనేమో సైలెంట్ అయిపోయారు. రెండు మూడు రోజులకు ఒక ట్వీట్ తప్ప రెగ్యులర్ గా చేయడం లేదు. ఎక్కడా మీడియాలోనూ కనిపించడం లేదు. అక్కడ ఉత్తరాంధ్రలోనూ కనిపించడం లేదు. సో.. విజయసాయి రెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే ఢిల్లీలో ఉన్నట్లు సమచారం. ఆయన ఉండాల్సిన విశాఖలో పీకే టీమ్ సర్వే నిర్వహిస్తోంది. వైసీపీ పని తీరు, గ్రేటర్ విశాఖ ఎన్నికల తరువాత అక్కడ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై సర్వే చేయడానికి పీకే టీమ్ మకాం వేసింది. ఉత్తరాంధ్రలో సమన్వయ కార్యక్రమాలు నిర్వహించాల్సిన విజయసాయిరెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలోనూ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు.

ఢిల్లీలో వ్యవహారాలకు ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్

ఎందుకంటే ఢిల్లీలో ఏపి ప్రభుత్వ వ్యవహారాలను చూసేందుకు జగన్మోహనరెడ్డి తాజాగా మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. ఆయన సీఎస్ గా రిటైర్ అయిన రోజునే ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో విజయసాయిరెడ్డి కి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున, పనులు ఏమి లేవు. కాకపోతే ఆయన పార్టీ వ్యవహారాల కారణంగా లోపాయికారీ కొన్ని వ్యవహారాలతో కొంత మంది బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ మధ్యనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. అదే విధంగా ఇంకొంత మంది కేంద్ర మంత్రులతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇవన్నీ జగన్మోహనరెడ్డికి తెలియకుండా చేస్తున్నట్లు అయితే ఏమీ కాదు. జగన్మోహనరెడ్డి సూచన మేరకే ఏపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా గానీ లేక వైసీపీకి అటు కేంద్రంలోని బీజేపీ మధ్య లోపాయికారీ వ్యవహారాలు అంటే అనధికార పొత్తులో భాగంగా కొన్ని చర్చల కోసం విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉన్నారు. ఢిల్లీలో ఉన్నా ఆయన ట్విట్టర్ లో సైలెంట్ ఎందుకు అయ్యారు. ప్రత్యర్థులపై ఎందుకు పంచ్ లు వేయడం లేదు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే పార్టీ ఆయనను సైలెంట్ చేసింది. ఆయన హవా నెమ్మదిగా తగ్గిస్తుంది అన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఉత్తరాంధ్ర కు వేరే ఇన్ చార్జిని నియమించాలని చూస్తున్నారు. ఢిల్లీలో ఏపి వ్యవహారాలను చూసేందుకు ఆదిత్యనాథ్ దాస్ ను నియమించారు. దీంతో విజయసాయి రెడ్డికి కాస్త పని తగ్గినట్లే (తగ్గించినట్లే) అని అనుకుంటున్నారు.

This post was last modified on October 8, 2021 11:50 pm

Srinivas Manem

Share
Published by
Srinivas Manem

Recent Posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More

May 9, 2024

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More

May 9, 2024

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More

May 9, 2024

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More

May 9, 2024

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More

May 9, 2024

OTT: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More

May 9, 2024

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More

May 9, 2024

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More

May 9, 2024

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More

May 9, 2024

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More

May 9, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More

May 9, 2024

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More

May 9, 2024

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More

May 9, 2024

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More

May 9, 2024

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More

May 9, 2024